కేసీఆర్ ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మతం పేరుతో రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పేదవాడు ఏ మతస్తుడైనా కూడా మనిషిలా లాగా చూసి వారికి కావలసిన వసతులు కేసీఆర్ అందించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలలో 1,32,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అలాగే 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ను పేద మైనారిటీ విద్యార్థులకు అందజేశామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Tillu Square: టిల్లు స్క్వేర్కి ఏమైంది? మీడియా షోతో పాటు యూఎస్ ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్?
గత పది సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు, అల్లర్లు జరిగినా.. కేసీఆర్ పాలనలో మాత్రం అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉన్నారని గుర్తుచేశారు. దేశంలో అభివృద్ధి కావాలన్నా.. శాంతి రావాలన్నా కేపీఆర్ లాంటి నేత చాలా అవసరం అని కేటీఆర్ వ్యా్ఖ్యానించారు. ఈ ఇఫ్తార్ విందులో స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Samantha: సైలెంట్ గా ముంబైకి షిప్ట్ అవుతున్న సమంత.. అందుకే వారికి నో?
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే అభ్యర్థుల తరపున కూడా కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.