Bandaru Satyaranarayana: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒకట్రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
Read Also: Visakha Drugs Case: విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా చుట్టూ బిగుస్తున్న వచ్చు
ఈ ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేయాలని బండారు భావించారు. కానీ కూటమిలో భాగంగా జనసేనకు టికెట్ పోయింది. పంచకర్ల రమేష్ బాబుకు ఈ సీటును కేటాయించారు. దీంతో సత్యనారాయణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య.. టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీలో చేరితే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది.