Anil Kumar Yadav: పార్టీ మారుతున్నారనే వార్తలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ!
- తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారు
- నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ
- జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా..
- మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kumar Yadav: తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయా ఛానళ్లు తమ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ ఎలా ఉంటే అలా ఉంటానని స్పష్టం చేశారు. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉన్నానని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఒకవేళ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే ఏ పార్టీ వైపు కూడా వెళ్లనన్నారు. త్వరలోనే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటానన్నారు. తనను ఏదో విధంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టాలని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
Read Also: YS Jagan: సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
దీనికోసం లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఎందరో మహామహులు జైలుకు వెళ్లారని.. జైలును చూసి భయపడనని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. జిల్లాలో శునకానందం పొందుతున్న కొందరు అధికారంలోకి వచ్చామని.. తమకు మించిన వీరులు లేరని అనుకుంటున్నారన్నారు. ఇలా అనుకున్న ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. తాను ఇంకా యువకుడినే అని, మేం మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు తడాఖా చూపిస్తామన్నారు. పల్నాడుకు వెళ్లి పోటీ చేసిన తర్వాత అక్కడ ప్రజలు ఎంతగానో ఆదరించారని చెప్పారు. ఎమ్మెల్యేల కంటే 40 వేల ఓట్లు అధికంగా తనకు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని వారిపై దాడులు చేస్తున్నారని.. తాను ఆ ప్రాంతంలో పర్యటిస్తే వారిపై దాడులు చేస్తారని అనుకుంటున్నామన్నారు. అందువల్లే దూరంగా ఉంటున్నానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమన్నారు. ఇచ్చింది డబుల్ గానే తిరిగి చెల్లిస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!