Anil Kumar Yadav: పార్టీ మారుతున్నారనే వార్తలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ!
- తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారు
- నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ
- జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా..
- మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kumar Yadav: తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయా ఛానళ్లు తమ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ ఎలా ఉంటే అలా ఉంటానని స్పష్టం చేశారు. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉన్నానని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఒకవేళ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే ఏ పార్టీ వైపు కూడా వెళ్లనన్నారు. త్వరలోనే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటానన్నారు. తనను ఏదో విధంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టాలని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
Read Also: YS Jagan: సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
దీనికోసం లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఎందరో మహామహులు జైలుకు వెళ్లారని.. జైలును చూసి భయపడనని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. జిల్లాలో శునకానందం పొందుతున్న కొందరు అధికారంలోకి వచ్చామని.. తమకు మించిన వీరులు లేరని అనుకుంటున్నారన్నారు. ఇలా అనుకున్న ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. తాను ఇంకా యువకుడినే అని, మేం మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు తడాఖా చూపిస్తామన్నారు. పల్నాడుకు వెళ్లి పోటీ చేసిన తర్వాత అక్కడ ప్రజలు ఎంతగానో ఆదరించారని చెప్పారు. ఎమ్మెల్యేల కంటే 40 వేల ఓట్లు అధికంగా తనకు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని వారిపై దాడులు చేస్తున్నారని.. తాను ఆ ప్రాంతంలో పర్యటిస్తే వారిపై దాడులు చేస్తారని అనుకుంటున్నామన్నారు. అందువల్లే దూరంగా ఉంటున్నానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమన్నారు. ఇచ్చింది డబుల్ గానే తిరిగి చెల్లిస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!