జగిత్యాల జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తామంటుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాల కల జగిత్యాల జిల్లా అని తెలిపారు. కానీ జగిత్యాల జిల్లాను ఈ ప్రభుత్వం తీసేస్తామంటుందన్నారు. జగిత్యాల జిల్లాగా ఉండాలంటే నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ ప్రాంత రైతుల బాధ తనకు తెలుసు అని చెప్పారు. వరద కాలువను రిజర్వాయర్గా చేసుకుని చెరువులు నింపుకున్నట్లుగా తెలిపారు. ఈ ప్రభుత్వం 5 నెలల్లో వరద కాలువను ఎండబెట్టిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించిందని ధ్వజమెత్తారు. అచ్చేదిన్ రాలె కానీ సచ్చే దిన్ వచ్చింది అన్నారు.
ఇది కూడా చదవండి: Bernard Hill : టైటానిక్ నటుడు మృతి
‘‘మోడీ హయంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. 9 సంవత్సరాలుగా నిర్వీరామంగా వచ్చిన నీళ్లు, కరెంట్ ఎక్కడికి పోయాయి. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచి నాలుగు రూపాయలు కూడా తేలేదు. సబ్ కా వికాస్ జరగలేదు కానీ సబ్ కా సత్యనాష్ జరిగింది. ఎంపీ అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిదిలో ఎన్ని నిధులు తెచ్చారు. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వడ్లు పండించాము కానీ మోడీ కొనలేదు. నూకలు తినుమన్న నూకరాజు మోడీ. మోడీకి ఎందుకు ఓటు వేయాలి. గోదారి నీళ్లను మోడీ ఎత్తుకపోతే ఈ సీఎం మాట్లాడడం లేదు.’’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Karnataka: మూగవాడైన కొడుకుని మొసళ్లు ఉండే నదిలో విసిరేసిన తల్లి..