Hemant Soren: అయిదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం..
- ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్కి పాల్పడినట్లు ఆరోపిస్తూ.. అరెస్ట్ చేసిన ఈడీ
- బెయిల్ మంజూరు చేసి జార్ఖండ్ హైకోర్టు
- రాష్ట్ర రాజధానిలో 8.86 ఎకరాల భూమిని సేకరించడానికి తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం విడుదలయ్యారు. ఆయన ఈ కేసులో అయిదు నెలలు జైలులో ఉన్నారు. ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్కి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈడీ సోరెన్ని అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే ఈ రోజు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.హేమంత్ సొరేన్ ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూర్ కావడంపై పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో మిఠాయిలను పంచుకున్నారు. సోరెన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జనవరి 31న అరెస్టు చేశారు. సోరెన్ ను అన్యాయంగా టార్గెట్ చేశారని, ఆయనపై పెట్టింది రాజకీయ ప్రేరేపిత, కల్పిత కేసు అని ఆయన తరఫు న్యాయవాది, సీనియర్ అడ్వొకేట్ మీనాక్షి అరోరా వాదించారు.
READ MORE: Rahul Gandhi: ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్లో వీడియో షేర్
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఈడీ వాదనలు ఇలా..
జార్ఖండ్ రాష్ట్ర రాజధానిలో 8.86 ఎకరాల భూమిని సేకరించడానికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న హేమంత్ సొరేన్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అక్రమ భూదందాలో హేమంత్ సోరెన్ ప్రమేయాన్ని సాక్షులు ధృవీకరించారని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. భూ యాజమాన్య వివరాలను మార్చడానికి అధికారిక రికార్డులను తారుమారు చేయాలని మాజీ సీఎం ఆదేశించారని సోరెన్ మీడియా కన్సల్టెంట్ అభిషేక్ ప్రసాద్ అంగీకరించారని ఈడీ వెల్లడించింది. జనవరి 31న హేమంత్ సోరెన్ ను అరెస్టు చేయడానికి ముందు ఈడీ పలుమార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది.
READ MORE: DELHI: నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో విపక్షాల నిరసన..స్పృహ తప్పిపడిపోయిన రాజ్యసభ ఎంపీ..
సొరేన్ తరఫున న్యాయవాది ఏమన్నారంటే..
ఈడీ ఆరోపిస్తున్న భూ కబ్జా ఆరోపణలు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కిందకు రావని హేమంత్ సొరేన్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు వాదించారు. ఒకవేళ, ఆ ఆరోపణలు నిజమైనా, అవి ఆస్తి హక్కుకు సంబంధించిన సివిల్ వివాదం అవుతుందే తప్ప క్రిమినల్ కేసు కాదని ఆయన వాదించారు. సోరెన్ ను జైల్లో పెట్టాలన్న దురుద్దేశంతోనే ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరిగాయని కపిల్ సిబల్ ఆరోపించారు. ఎట్టకేలకు ఆయన అయిదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?