Hemant Soren: అయిదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం..
- ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్కి పాల్పడినట్లు ఆరోపిస్తూ.. అరెస్ట్ చేసిన ఈడీ
- బెయిల్ మంజూరు చేసి జార్ఖండ్ హైకోర్టు
- రాష్ట్ర రాజధానిలో 8.86 ఎకరాల భూమిని సేకరించడానికి తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించిన ఈడీ
భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం విడుదలయ్యారు. ఆయన ఈ కేసులో అయిదు నెలలు జైలులో ఉన్నారు. ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్కి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈడీ సోరెన్ని అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే ఈ రోజు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.హేమంత్ సొరేన్ ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూర్ కావడంపై పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో మిఠాయిలను పంచుకున్నారు. సోరెన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జనవరి 31న అరెస్టు చేశారు. సోరెన్ ను అన్యాయంగా టార్గెట్ చేశారని, ఆయనపై పెట్టింది రాజకీయ ప్రేరేపిత, కల్పిత కేసు అని ఆయన తరఫు న్యాయవాది, సీనియర్ అడ్వొకేట్ మీనాక్షి అరోరా వాదించారు.
READ MORE: Rahul Gandhi: ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్లో వీడియో షేర్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈడీ వాదనలు ఇలా..
జార్ఖండ్ రాష్ట్ర రాజధానిలో 8.86 ఎకరాల భూమిని సేకరించడానికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న హేమంత్ సొరేన్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అక్రమ భూదందాలో హేమంత్ సోరెన్ ప్రమేయాన్ని సాక్షులు ధృవీకరించారని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. భూ యాజమాన్య వివరాలను మార్చడానికి అధికారిక రికార్డులను తారుమారు చేయాలని మాజీ సీఎం ఆదేశించారని సోరెన్ మీడియా కన్సల్టెంట్ అభిషేక్ ప్రసాద్ అంగీకరించారని ఈడీ వెల్లడించింది. జనవరి 31న హేమంత్ సోరెన్ ను అరెస్టు చేయడానికి ముందు ఈడీ పలుమార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది.
READ MORE: DELHI: నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో విపక్షాల నిరసన..స్పృహ తప్పిపడిపోయిన రాజ్యసభ ఎంపీ..
సొరేన్ తరఫున న్యాయవాది ఏమన్నారంటే..
ఈడీ ఆరోపిస్తున్న భూ కబ్జా ఆరోపణలు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కిందకు రావని హేమంత్ సొరేన్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు వాదించారు. ఒకవేళ, ఆ ఆరోపణలు నిజమైనా, అవి ఆస్తి హక్కుకు సంబంధించిన సివిల్ వివాదం అవుతుందే తప్ప క్రిమినల్ కేసు కాదని ఆయన వాదించారు. సోరెన్ ను జైల్లో పెట్టాలన్న దురుద్దేశంతోనే ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరిగాయని కపిల్ సిబల్ ఆరోపించారు. ఎట్టకేలకు ఆయన అయిదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో