Dangerous Milk: ఇది నిజమా? పాకెట్ పాలలో శవాలకు వాడే కెమికల్
మీ ఇంట ప్యాకెట్ పాలు వాడుతున్నారా? పిల్లలకు కూడా అవే పడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.,…ఇప్పుడు మనం వాడుతున్న పాలలో విభ్రాంతికర విషయాలు బయటకు వస్తున్నాయి. శవాలకు వాడే కెమికల్ ను పాలల్లో కలుపుతున్నారనే చేదు నిజాలు బయటపడుతున్నాయి. యాదాద్రి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. శవాలను భద్రపరచడానికి వాడే కెమికల్ ను పాలలో కలుపుతున్నట్లు తేలింది. బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్ లో పాలను టెస్ట్ చేయటంతో అసలు నిజం బయటపడింది.
శవాలను భద్రపరచడానికి వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్ పాలల్లో ఉపయోగిస్తున్నారని తేలింది. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా పగిలిపోకుండా ఉండేందుకు ఫార్మాల్డిహైడ్ కెమికల్ వాడుతున్నారు. ఈ విషయాన్ని పాల సేకరణ సెంటర్ నిర్వాహకుడు కడెం కుమార్ యాదవ్ అధికారుల ఎదుట అంగీకరించారు. ఈ కేంద్రానికి రోజూ 600 లీటర్లకు పైగా పాల సరఫరా జరుగుతుంది. కుమార్ యాదవ్ పాలలో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్ కలిపి ఎక్కువ పాలు తయారు చేస్తున్నాడని అధికారులు తెలిపారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also: MLC Kavitha: హైదరాబాద్లో సంక్రాంతి వేడుకలు.. భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
ఆ పాలను ప్యాక్ చేసి స్థానికంగా విక్రయిస్తూ హైదరాబాద్ లోని హోటల్ కి తరలిస్తున్నాడు. దీంతో కుమార్ యాదవ్ ని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అతనిపై ఎలాంటి కేసులు పెట్టవద్దని ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లకు బీబీనగర్ మండలానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఫోన్ చేసినట్లు తెలిసింది. పర్మిషన్ లేకుండా పాల వ్యాపారం చేస్తున్న మరో ఇద్దరిపైనా కేసు ఫైల్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురంలో ఇటీవల కల్తీ పాల తయారీ వెలుగులోకి వచ్చింది. . దీంతో బీబీ నగర్లోని టోల్గేట్ వద్ద ఎస్ఐ సహకారంతో యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ లో వాడే పాలల్లో ఈ కెమికల్ ఉందని తెలిసి వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ కెమికల్ వాడడం వల్ల పిల్లలపైనే కాదు పెద్దలపై కూడా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ పాలు వాడడం వల్ల జీర్ణకోశ, కాలేయ సంబంధమైన వ్యాధులతో పాటు మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరించారు. పిల్లలకు జీర్ణ సంబంధమయిన ఇబ్బందులు, విరేచనాలు, వాంతులు, మెదడు సంబంధమయిన వ్యాధులు కలుగుతాయి. పాలను కల్తీ చేయడం అంటే తీవ్రమయిన నేరంగా పరిగణించాలి.. అలాంటి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయించాలి.
Read Also: Jabardasth Varsha: వర్ష నీ డ్రస్ అక్కడ చిరిగింది.. తెలిసే వేసుకున్నావా?
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!