Covid Vaccines: కోవిడ్ వ్యాక్సిన్ల కోసం రూ. 36 వేల కోట్లు.. ప్రజలు ఎన్ని డోస్లు తీసుకున్నారంటే..?
- 2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించాం
- -కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్
- వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3012 లక్షల డోస్లు
- 99 దేశాలకు.. రెండు UN సంస్థలకు పంపించాం- ప్రతాప్రావు జాదవ్
- కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం సుమారు రూ. 36 వేల 398 కోట్లు ఖర్చు.
2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లోక్సభలో తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3,012 లక్షల డోస్ల కోవిడ్-19 వ్యాక్సిన్లను 99 దేశాలకు, రెండు UN సంస్థలకు పంపించామని ఆయన చెప్పారు. అలాగే.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత సరఫరా కింద కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం సుమారు రూ. 36 వేల 398 కోట్లు ఖర్చు చేశామన్నారు.
Read Also: Double iSmart: డబల్ ఇస్మార్ట్ ట్రైలర్ వచ్చేది అప్పుడే
Also Read
రాష్ట్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ల కేటాయింపు దామాషా లక్ష్యం.. జనాభా, అక్కడ వ్యాక్సిన్ల పురోగతి, వ్యాక్సిన్ల వృధా ప్రాతిపదికన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం అవసరాన్ని బట్టి.. రాష్ట్ర పరిపాలన ద్వారా నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం కింద భారతదేశం మొత్తం 3012.465 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లను.. 99 దేశాలు, రెండు UN సంస్థలకు పంపినట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి తెలిపారు.
Read Also: Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
బయోటెక్నాలజీ విభాగం (DBT), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC).. దాని ప్రభుత్వ రంగ సంస్థ, COVID-19 వ్యాక్సిన్ల పరిశోధన మరియు అభివృద్ధి కోసం విద్యాసంస్థలు.. పరిశ్రమలకు మద్దతునిచ్చాయని మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. డీబీటీ, బీఐఆర్ఏసీ ద్వారా రూ.533.3 కోట్ల పెట్టుబడులు విడుదల చేసినట్లు అమలు చేసే ఏజెన్సీలకు తెలిపారు. మిషన్ కోవిడ్ సురక్ష కింద.. వ్యాక్సిన్ తయారీదారులకు వారి సౌకర్యాల వద్ద వ్యాక్సిన్ తయారీని పెంచడానికి రూ. 158.4 కోట్ల సహాయం అందించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సుమారు రూ. 60 కోట్లు ఖర్చు చేసిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
-
Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!