Hyderabad: హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు..
- హైదరాబాద్లో పలుచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు
- జూబ్లీహిల్స్, అమీర్ పేట్లోని ఉత్తరాస్ టిఫిన్స్, అయితే బిర్యానీ, టిబ్బ్స్ ప్రాక్టీస్, కింగ్స్ ఆఫ్ కబాబ్స్
- మెహదీపట్నం అబ్దుల్ బాయ్స్ హాస్టల్, మధురానగర్లోని యూనివర్సల్ ఆల్ మతంలో తనిఖీలు
- యూసఫ్ గూడా రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో పలుచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. నగరంలో ఫుడ్ కల్తీ ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, అమీర్ పేట్లోని ఉత్తరాస్ టిఫిన్స్, అయితే బిర్యానీ, టిబ్బ్స్ ప్రాక్టీస్, కింగ్స్ ఆఫ్ కబాబ్స్తో పాటు మెహదీపట్నంలోని అబ్దుల్ బాయ్స్ హాస్టల్, మధురానగర్లోని యూనివర్సల్ ఆల్ మతం మండి కబాబ్స్ అండ్ బిర్యానీ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేశారు. కొన్ని రెస్టారెంట్లు సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించి.. వాటిని సీజ్ చేశారు. అనంతరం టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపించారు.
Read Also: Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోంది.. ప్రళయం తప్పదా..?
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
మరోవైపు.. యూసఫ్ గూడా రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. FSSAI నిబంధనలను విరుద్ధంగా నిర్వహణ ఉన్నట్లు గుర్తించి.. ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చాలా చోట్ల హాస్టల్స్, రెస్టారెంట్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వహకులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Nayanthara: నయనతార వెడ్డింగ్ సీన్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందో తెలుసా?
ఇటీవల జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై చేసిన దాడుల్లో చీకటి నిజాలు వెలుగుచూశాయి. అక్కడ కుళ్లిన చికెన్, పురుగులు పట్టిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. చాలా చోట్ల బిర్యానీల్లో బల్లులు, బొద్దింకలు, పలు అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. ఈ పరిణామాలతో అనేక హోటళ్లను సీజ్ చేశారు. బిర్యానీ శాంపిల్స్లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే.. హోటల్స్, రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. దీంతో.. సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!