Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోంది.. ప్రళయం తప్పదా..?
- వేగంగా కదులుతున్న భూమి ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం..
- కెనడా నుంచి సైబీరియా వైపుగా కదలిక..
- దక్షిణ ధ్రువంలో కూడా మార్పు..
- భూమిపై విపరీత పరిణామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత క్షేత్రం వేగం మార్పులకు గురవుతున్నట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం వేగంగా రష్యా వైపు కదులుతున్నట్లుగా చెప్పారు. లైవ్ సైన్స్ ప్రకారం.. శాస్త్రవేత్తలు దశాబ్ధాలుగా ఉత్తర ధ్రువాన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇది కెనడా నుంచి సైబీరియా వైపు 2250 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ దాని కదలిక ఇటీవల కాలంలో వేగవంతమైంది. 1990-2005 మధ్య కదలిక రేటు ఏడాదికి 15 కి.మీ నుంచి 50-60 కి.మీకి పెరిగింది.
భూమి అయస్కాంత క్షేత్రాలు మన నిత్య జీవితంలో చాలా పనులతో ముడిపడి ఉన్నాయి. నావిగేషన్ వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు భూమి, భూ వాతావరణాన్ని, జీవజాలాన్ని ప్రమాదకర రేడియేషన్ నుంచి రక్షిస్తోంది. మనం ఉపయోగించ జీపీఎస్ వ్యవస్థకు ఉత్తర అయస్కాంత ధ్రువం ముఖ్యమైందింది.
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
అయస్కాంత ధ్రువాల కదలిక అంటే ఏమిటి..?
మన స్మార్ట్ ఫోన్లు, ఇతర పరికరాలను నావిగేట్ చేయడానికి అనుమతించే కీలకమైన పాయింట్ మార్పుని శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తున్నారు. ఈ కదలిక వేగంగా కొనసాగితే రాబోయే దశాబ్ధంలో భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం 660 కిలోమీటర్లు కదులుతుంది. బ్రిటీష్ జియోలాజికల్ సర్వే (BGS) శాస్త్రవేత్తల ప్రకారం, 2040 నాటికి అన్ని దిక్సూచిలు బహుశా నిజమైన ఉత్తరానికి తూర్పు వైపుగా సూచిస్తాయి.
మరోవైపు దక్షిణ ధ్రువం కూడా కదులుతోంది. అంటార్కిటికా మీదుగా తూర్పు వైపుకు జారిపోతోంది. ప్రతి 300,000 సంవత్సరాలకు స్విచ్ జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చివరి సారిగా ఇలా ధ్రువాలు మారడం 7,80,000 ఏళ్ల క్రితం జరిగింది. కాబట్టి చాలా కాలం అవుతుందని చెబుతున్నారు.
పోల్స్ ఎందుకు కదులుతున్నాయి..?
భూమి బయటి కోర్లోని ద్రవ రూపంలోని ఇనుము అనూహ్య మార్గాల్లో ప్రవహిస్తుంటుంది. దీని వల్ల అయస్కాంత ధ్రువాలు మారుతుంటాయి. ధ్రువాలు ఇటా మారినప్పుడు, ఆపోజిట్ పొలారిటీ మళ్లీ పెరగడానికి ముందు మాగ్నిటిక్ ఫీల్డ్ జీరోకి చేరుతుంది.
భూమి మాగ్నిటిక్ ఫీల్డ్ జీరోకి చేరితే ఏమవుతుంది..?
భూమి అయస్కాంత క్షేత్రం భూమిని రక్షిస్తోంది. సూర్యుడు, ఇతర అంతరిక్ష పదార్థాల నుంచి వచ్చే ఆవేశిత కణాలను, రేడియేషన్ని ఈ మాగ్నిటిక్ ఫీల్డ్ తిప్పికొడుతోంది. భూమి కోర్ నుంచి అంతరిక్షంలోకి ఒక బుడగలా ఏర్పడి భూమిని ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంది. ఒక వేళ ఈ అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే, భూమిపై రేడియేషన్ పెరుగుతుంది. తద్వారా జీవ కనాల మ్యుటేషన్ రేటు పెరుగుతుంది. జంతువుల్లో క్యాన్సర్కి దారి తీస్తుంది.
తాజావార్తలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!