Paralysis: పక్షవాతం దరిచేరకుండా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి రోజూ తీసుకునే ఆహారం, జీవన విధానం వల్లే వ్యాధులు సంక్రమిస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధులు మనల్ని జీవితాంతం మంచానికే పరిమితం చేస్తాయి. అలాంటి వాటిట్లో ఒకటి పక్షవాతం. పక్షవాతానికి అధిక రక్తపోటు అతి పెద్ద కారకం. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్లకు 80 ఏళ్లకు ముందే పక్షవాతం వచ్చే అవకాశం 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉందని నిపుణుల చెబుతున్నారు. రక్తపోటును మందులు వేసుకోవటం, ఆహార, విహార మార్పులతో అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ మితి మీరకుండా జాగ్రత్తపడాలి. కొలెస్ట్రాల్ శాతం పెరిగితే.. రక్తనాళాలును దెబ్బతీస్తాయి. ఇది రక్తనాళాల మార్గం సన్నబడటానికి, పూడికలకు దారితీస్తుంది. పూడిక మరీ పెరిగితే రక్తనాళం మూసుకుపోవచ్చు. ఆ భాగం చిట్లిపోయి రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. మెదడు రక్తనాళాల్లో ఇవి ఏర్పడితే పక్షవాతానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అందరిలో మధుమేహం కామన్ గా మారింది. చిన్న పిల్లలకు కూడా ఈ సమస్య వస్తుంది. కాగా దానిని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మధుమేహంతో మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. ఇది పక్షవాతం ముప్పు పెంచుతుంది. మధుమేహం గలవారిలో అధిక రక్తపోటూ కనిపిస్తుంటుంది.
READ MORE: Heatwave: దేశంలోని పలు ప్రాంతాల్లో 48.8 డిగ్రీల ఎండలు.. ‘రెడ్’ వార్నింగ్ జారీ
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
పొగ తాగటం చాలా ప్రమాదకరం. ఇతర ముప్పు కారకాలేవీ లేకపోయినా ఒక్క దీంతోనే పక్షవాతం ముప్పు పెరుగుతుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. మానేసిన రెండేళ్ల తర్వాత పక్షవాతం ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ఐదేళ్ల తర్వాత అయితే పొగ తాగనివారి స్థాయికి ముప్పు పడిపోతుంది.
మాదక ద్రవ్యాలు కూడా చాలా ప్రమాదం. మాదక ద్రవ్యాలతో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. వీటిని తీసుకున్న ప్రతీసారీ ముప్పు పెరుతోంది. దీనికి ఇతర ముప్పు కారకాలూ తోడైతే మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కొందరికి రక్తనాళాల గోడ బలహీనంగా ఉన్నచోట బుడగలా ఉబ్బుతుంది (అన్యూరిజమ్). ఇవి చిట్లిపోయి రక్తస్రావం కావొచ్చు. ఇది మెదడు చుట్టుపక్కల చేరుకొని లోపల పీడనం పెరగొచ్చు. ఫలితంగా వాపు, కొన్నిసార్లు పక్షవాతమూ సంభవించొచ్చు. చిన్న చిన్నవి.. 3 మి.మీ. కన్నా తక్కువ వ్యాసం గల రక్తనాళ ఉబ్బులతో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ 7 మి.మీ. కన్నా పెద్దగా ఉంటే రక్తస్రావమయ్యే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమస్య గలవారు ఉన్న వాళ్లు వైద్యుల సూచనలు పాటించి నయం చేసుకునేందుకు యత్నించడం మంచింది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!