Paralysis: పక్షవాతం దరిచేరకుండా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి రోజూ తీసుకునే ఆహారం, జీవన విధానం వల్లే వ్యాధులు సంక్రమిస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధులు మనల్ని జీవితాంతం మంచానికే పరిమితం చేస్తాయి. అలాంటి వాటిట్లో ఒకటి పక్షవాతం. పక్షవాతానికి అధిక రక్తపోటు అతి పెద్ద కారకం. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్లకు 80 ఏళ్లకు ముందే పక్షవాతం వచ్చే అవకాశం 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉందని నిపుణుల చెబుతున్నారు. రక్తపోటును మందులు వేసుకోవటం, ఆహార, విహార మార్పులతో అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ మితి మీరకుండా జాగ్రత్తపడాలి. కొలెస్ట్రాల్ శాతం పెరిగితే.. రక్తనాళాలును దెబ్బతీస్తాయి. ఇది రక్తనాళాల మార్గం సన్నబడటానికి, పూడికలకు దారితీస్తుంది. పూడిక మరీ పెరిగితే రక్తనాళం మూసుకుపోవచ్చు. ఆ భాగం చిట్లిపోయి రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. మెదడు రక్తనాళాల్లో ఇవి ఏర్పడితే పక్షవాతానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అందరిలో మధుమేహం కామన్ గా మారింది. చిన్న పిల్లలకు కూడా ఈ సమస్య వస్తుంది. కాగా దానిని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మధుమేహంతో మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. ఇది పక్షవాతం ముప్పు పెంచుతుంది. మధుమేహం గలవారిలో అధిక రక్తపోటూ కనిపిస్తుంటుంది.
READ MORE: Heatwave: దేశంలోని పలు ప్రాంతాల్లో 48.8 డిగ్రీల ఎండలు.. ‘రెడ్’ వార్నింగ్ జారీ
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
పొగ తాగటం చాలా ప్రమాదకరం. ఇతర ముప్పు కారకాలేవీ లేకపోయినా ఒక్క దీంతోనే పక్షవాతం ముప్పు పెరుగుతుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. మానేసిన రెండేళ్ల తర్వాత పక్షవాతం ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ఐదేళ్ల తర్వాత అయితే పొగ తాగనివారి స్థాయికి ముప్పు పడిపోతుంది.
మాదక ద్రవ్యాలు కూడా చాలా ప్రమాదం. మాదక ద్రవ్యాలతో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. వీటిని తీసుకున్న ప్రతీసారీ ముప్పు పెరుతోంది. దీనికి ఇతర ముప్పు కారకాలూ తోడైతే మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కొందరికి రక్తనాళాల గోడ బలహీనంగా ఉన్నచోట బుడగలా ఉబ్బుతుంది (అన్యూరిజమ్). ఇవి చిట్లిపోయి రక్తస్రావం కావొచ్చు. ఇది మెదడు చుట్టుపక్కల చేరుకొని లోపల పీడనం పెరగొచ్చు. ఫలితంగా వాపు, కొన్నిసార్లు పక్షవాతమూ సంభవించొచ్చు. చిన్న చిన్నవి.. 3 మి.మీ. కన్నా తక్కువ వ్యాసం గల రక్తనాళ ఉబ్బులతో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ 7 మి.మీ. కన్నా పెద్దగా ఉంటే రక్తస్రావమయ్యే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమస్య గలవారు ఉన్న వాళ్లు వైద్యుల సూచనలు పాటించి నయం చేసుకునేందుకు యత్నించడం మంచింది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..