Nirmala Sitharaman: సుస్థిర అభివృద్ధికి చేయూతనివ్వండి.. ప్రైవేట్ రంగానికి మంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి
Nirmala Sitharaman: ప్రైవేట్ రంగానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ పెద్ద విజ్ఞప్తి చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రైవేట్ రంగం సహకరించాలని ఆమె అన్నారు. ప్రభుత్వం, సంస్థల ద్వారా కృషి జరుగుతుందన్నారు. ప్రయివేటు రంగం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని ఆర్థిక మంత్రి విజ్ఞప్తి చేశారు. దాతృత్వంగా ఇచ్చే మూలధనం ఖర్చులు, నష్టాలను తగ్గించడంలో.. ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడంలో కూడా సహాయపడుతుందని ఆమె అన్నారు. ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావడం, సహకరించడం వాటాదారులందరి బాధ్యత అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో మొరాకోలో జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ ఆర్థిక మంత్రి ఈ విషయాలు తెలిపారు.
Read Also:Vizag: రేపు విశాఖకు త్రీమెన్ కమిటీ.. వైజాగ్ లో CMO, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన
Also Read
నిర్మలా సీతారామన్ ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆమె జీ20 దేశాల ఆర్థిక మంత్రుల నాల్గవ సమావేశంలో పాల్గొనవలసి ఉంది. దీనితో పాటు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సమావేశం కూడా మొరాకోలో జరగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి కూడా పాల్గొననున్నారు. మొరాకోలో జరిగిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రపంచ లక్ష్యాలను సాధించడంలో ప్రైవేట్ రంగాలు ముందుకు రావాలన్నారు. ఐక్యరాజ్యసమితిలోని దేశాలు 2015లో 17 లక్ష్యాలను ఆమోదించాయి. పేదరికం, ఆకలి, నగరాల అభివృద్ధి వంటి అన్ని ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం ఇందులో ఉంది. ఈ లక్ష్యాన్ని 2030 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో సీతారామన్ ఈ ప్రకటన మరింత ముఖ్యమైనదిగా మారింది. ఎందుకంటే స్థిరమైన అభివృద్ధి వంటి ప్రపంచ సమస్యలకు డబ్బు ఇచ్చే ప్రక్రియ ప్రశ్నార్థకంలో ఉంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి గ్లోబల్ ఏజెన్సీలు ఈ పద్ధతులను మార్చాలని ఒత్తిడి తెస్తున్నాయి.
Read Also:High Court: భార్యాభర్తలు ఎవరి ఫోన్ కాల్ రికార్డు చేసినా తప్పే.. హైకోర్టు కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!