Nirmala Sitharaman: సుస్థిర అభివృద్ధికి చేయూతనివ్వండి.. ప్రైవేట్ రంగానికి మంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: ప్రైవేట్ రంగానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ పెద్ద విజ్ఞప్తి చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రైవేట్ రంగం సహకరించాలని ఆమె అన్నారు. ప్రభుత్వం, సంస్థల ద్వారా కృషి జరుగుతుందన్నారు. ప్రయివేటు రంగం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని ఆర్థిక మంత్రి విజ్ఞప్తి చేశారు. దాతృత్వంగా ఇచ్చే మూలధనం ఖర్చులు, నష్టాలను తగ్గించడంలో.. ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడంలో కూడా సహాయపడుతుందని ఆమె అన్నారు. ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావడం, సహకరించడం వాటాదారులందరి బాధ్యత అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో మొరాకోలో జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ ఆర్థిక మంత్రి ఈ విషయాలు తెలిపారు.
Read Also:Vizag: రేపు విశాఖకు త్రీమెన్ కమిటీ.. వైజాగ్ లో CMO, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన
Also Read
- IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
నిర్మలా సీతారామన్ ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆమె జీ20 దేశాల ఆర్థిక మంత్రుల నాల్గవ సమావేశంలో పాల్గొనవలసి ఉంది. దీనితో పాటు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సమావేశం కూడా మొరాకోలో జరగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి కూడా పాల్గొననున్నారు. మొరాకోలో జరిగిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రపంచ లక్ష్యాలను సాధించడంలో ప్రైవేట్ రంగాలు ముందుకు రావాలన్నారు. ఐక్యరాజ్యసమితిలోని దేశాలు 2015లో 17 లక్ష్యాలను ఆమోదించాయి. పేదరికం, ఆకలి, నగరాల అభివృద్ధి వంటి అన్ని ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం ఇందులో ఉంది. ఈ లక్ష్యాన్ని 2030 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో సీతారామన్ ఈ ప్రకటన మరింత ముఖ్యమైనదిగా మారింది. ఎందుకంటే స్థిరమైన అభివృద్ధి వంటి ప్రపంచ సమస్యలకు డబ్బు ఇచ్చే ప్రక్రియ ప్రశ్నార్థకంలో ఉంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి గ్లోబల్ ఏజెన్సీలు ఈ పద్ధతులను మార్చాలని ఒత్తిడి తెస్తున్నాయి.
Read Also:High Court: భార్యాభర్తలు ఎవరి ఫోన్ కాల్ రికార్డు చేసినా తప్పే.. హైకోర్టు కీలక నిర్ణయం
తాజావార్తలు
-
బండోడి ట్యూన్కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
-
IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
-
Big Alert : ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!