NTV Telugu Site icon

Hyderabad: షాద్ నగర్ లో సినిమా స్టైల్ లో మర్డర్.. ఐదుగురు అరెస్టు

Hyderabad

Hyderabad

షాద్ నగర్ లో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నారని కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ కుమార్ హత్య చేశాడు. బీహార్ కు చెందిన చంద్రకుమార్ అనే సినిమాను అదే స్టైల్ లో కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ హతమార్చాడు. శంషాబాద్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో నివాసం ఉంటుంది. అయితే, గత నెల 29 తేదిన కరుణ కుమార్ మిస్సింగ్ అయ్యాడని తన అన్న దీపక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.

Read Also: Vijay Antony: విజయ్ కూతురు ఆత్మహత్య.. ప్రభాస్ నిర్మాతల కీలక నిర్ణయం

అయితే, రంజిత్ కుమార్ అనే వ్యక్తి కరుణ కుమార్ ను హత్య చేయాలని పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళిక రూపొందించి.. గత నెల 15 వ తేదీన కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో వరి చేను పొలం దగ్గరికి కరుణ కూమార్ ను పిలిపించుకొని కాళ్లు చేతులు కట్టేసి.. వరి చేను నీటి బురదలో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు అని డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: 3 Ekka: 20 రోజుల్లో 25 కోట్లు.. రికార్డులు బద్దలు కొడుతున్న గుజరాతీ సినిమా

అయితే రంజిత్ కుమార్ కూతురు విషయంలో కరుణ కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తన కూతురు నుదుటిపై సింధూరం లాంటి బొట్టు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తమ పరువు ఎక్కడ పోతుందోననే భయంతో ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులపై 302, 201, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ హత్య కేసులో రంజిత్ తో పాటు మంతోష్ కుమార్, దబ్లు కుమార్ అనే వ్యక్తులను కూడా అరెస్టు అయ్యారు. అయితే, మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా ఇద్దరు మైనర్లు కావడంతో వారి వివరాలను మీడియాకు వెల్లడించేందుకు డీసీపీ నారాయణ రెడ్డి నిరాకరించాడు. మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించినట్లు తెలిపారు.