Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లో కొత్తగా ఐదు ఎయిర్ పోర్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ కనెక్టివిటీ కోసం కొత్తగా ఐదు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుందని పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో ఉత్తరప్రదేశ్లో ఐదు ఎయిర్ పోర్టులను ప్రారంభిస్తామని ప్రకటించారు. జామ్ఘర్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకోట్లో ఎయిర్ పోర్టుల నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
Read Also: Konathala Ramakrishna: జనసేన వైపు మాజీ మంత్రి చూపు..! త్వరలో పవన్ కల్యాణ్ భేటీ..!
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
ఇక, 2014 వరకు ఉత్తరప్రదేశ్లో కేవలం ఆరు ఎయిర్ పోర్టులు మాత్రమే ఉండేవని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. అయోధ్య విమానాశ్రయంతో కలిపి 10కి చేరాయన్నారు. కేవలం నెల రోజుల్లో మరో 5 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి జీవార్లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి సింధియా వెల్లడించారు.
Read Also: Pragya Jaiswal: గులాబీ కలర్లో గుబాళిస్తున్న ప్రగ్యా జైస్వాల్
అయితే, ఇవాళ్టి నుంచి అయోధ్య- ఢిల్లీ మధ్య విమాన సేవలను ప్రారంభించిన ఇండిగో.. అలాగే, అయోధ్య టూ అహ్మదాబాద్ మధ్య వారానికి మూడుసార్లు విమానాలను నడపనుంది. జనవరి 15 నుంచి ముంబై-అయోధ్య మార్గంలో ఇండిగో మరిన్నీ సర్వీసులను నడపనుందని తెలిపారు. అయితే, ఈ నెల 22న జరగనున్న రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి అయోధ్య విమానాశ్రయంలో దాదాపు 100 చార్టర్డ్ ఫ్లైట్స్ రావొచ్చని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొ్న్నారు. అయోధ్యలోని శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తారనే అంచనాతో రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కనెక్టివిటీని కేంద్ర ప్రభుత్వ సహాయంతో మెరుగుపరిచిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!