Vande Bharat Train: రేపు ఈ మార్గంలో 20 కోచ్ల తొలి వందే భారత్ ట్రయల్ రన్..
- ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం
- రేపు 20 కోచ్లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్ రన్
- 130 కి.మీ వేగంతో ప్రయాణించనున్న ఈ రైలు
- అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్
- ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి..
- మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకోనున్న ట్రైన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 9న) 20 కోచ్లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్ని భారతీయ రైల్వే నిర్వహించబోతోంది. 130 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలును తొలిసారిగా ట్రయల్ చేయనున్నారు. అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలోని పెద్ద నగరాల మధ్య 16 కోచ్లతో.. చిన్న నగరాల మధ్య 8 కోచ్లతో వందే భారత్ రైలును నడుపుతున్నారు.
Read Also: Waqf Bill: విపక్షాల ఆందోళనతో “పార్లమెంట్ కమిటీ”కి వక్ఫ్ బిల్లు..
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
ప్రస్తుతానికి 16-16 కోచ్ల రెండు వందేభారత్ రైళ్లు అహ్మదాబాద్-ముంబై మార్గంలో నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లు ఈ దూరాన్ని చేరుకోవడానికి దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతుంది. ఈ రెండు రైళ్ల నుంచి 100 శాతం రెస్పాన్స్, ఆక్యుపెన్సీ అందుతుంది. ఈ క్రమంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని.. దేశంలోనే మొట్టమొదటి 20 కోచ్ల వందే భారత్ రైలును ఈ రెండు నగరాల మధ్య నడపాలని రైల్వేశాఖ భావించింది. ఈ క్రమంలో.. ఈ రైలు ట్రయల్ రన్ కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆగస్టు 9న అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య ట్రయల్ను ఆమోదించింది. ఈ మేరకు పశ్చిమ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయానికి రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Paris Olympics 2024: సెమీస్కి చేరిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్..
RDSO యొక్క స్పీడ్ సర్టిఫికేట్ ఆధారంగా 20 కోచ్ల వందే భారత్ రైలు వేగం గరిష్టంగా 130 కి.మీ. గంట. ఈ రైలు ట్రయల్ రన్ సమయంలో భద్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అన్ని LC గేట్లు, ఆక్రమణలు.. విరిగిన, తప్పిపోయిన బారికేడింగ్ సైట్ల వద్ద RPF సిబ్బందిని మోహరిస్తారు. ఈ రైలు నడిచే మార్గంలో దాదాపు 50 శాతం అంటే 792 రూట్ కి.మీ పశ్చిమ రైల్వే పరిధిలో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ రైల్వే మార్గంలో పశువుల కంచె, గోడకు కంచె పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!