Vande Bharat Sleeper Train: దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు రెడీ.. ఈ రూట్ లోనే..
- దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్
- జనవరి 17 లేదా 18న ప్రారంభోత్సవం జరిగే అవకాశం
- గౌహతి, కోల్కతా మధ్య పరుగులు తీయనున్నది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ ట్రైన్ ప్రయాణ స్థితినే మార్చేసింది. హై స్పీడ్ తో దూసుకెళ్తూ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తోంది. అయితే ఇప్పటి వరకు వందే భారత్ కార్ చైర్ ట్రైన్స్ మాత్రమే దేశ వ్యాప్తంగా పలు రూట్లలో పరుగులు తీస్తున్నాయి. ఇక ఇప్పుడు దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు రెడీ అయ్యింది. దేశీయంగా నిర్మించిన వందే భారత్ స్లీపర్ రైలు హై-స్పీడ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, కొత్త సంవత్సరం మొదటి రోజే రైల్వేలు దాని మార్గాన్ని ప్రకటించాయి.
Also Read:Vijay-Rashmika : రోమ్ వీధుల్లో విజయ్–రష్మిక రొమాన్స్.. వెనక నుంచి రష్మిక ‘టైట్ హగ్’ పిక్స్ వైరల్!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు గౌహతి, కోల్కతా మధ్య పరుగులు తీయనున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో దీనిని ప్రారంభిస్తారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026 సంస్కరణల సంవత్సరం అని రైల్వే మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం, గౌహతి నుండి కోల్కతాకు వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీ 3AC రైలుకు రూ.2,300, 2 AC రైలుకు రూ.3,000, 1 AC రైలుకు రూ.3,600గా ఉంటుంది.
జనవరిలో దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. జనవరి 17 లేదా 18న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. రాబోయే ఆరు నెలల్లో ఎనిమిది వందే భారత్ స్లీపర్ రైళ్లు, ఈ ఏడాది చివరి నాటికి 12 రైళ్లు వస్తాయని రైల్వే మంత్రి పేర్కొన్నారు.
Also Read:Naveen Chandra : భయానక ప్రపంచంలోకి తీసుకెళ్లిన నవీన్ చంద్ర ‘హనీ’ గ్లింప్స్
వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు
వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్లు ఉంటాయి, వీటిలో 11 థర్డ్ ఎసి, 4 సెకండ్ ఎసి, 1 ఫస్ట్ ఎసి కోచ్లు ఉంటాయి.
ఈ రైలులో మొత్తం 823 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు.
ఇది సెమీ-హై-స్పీడ్ రైలు, దీని డిజైన్ వేగం గంటకు 180 కిలోమీటర్లు.
కోచ్ల మధ్య కదలిక కోసం ఆటోమేటిక్ డోర్స్, వెస్టిబ్యూల్లు ఉన్నాయి.
మెరుగైన సస్పెన్షన్, తక్కువ శబ్దం కారణంగా, రైలు ప్రయాణం మరింత నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ రైలులో ఆర్మర్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్ ఉన్నాయి, ఇది భద్రతను మరింత పెంచుతుంది.
శుభ్రపరచడానికి క్రిమిసంహారక సాంకేతికతను ఉపయోగించారు.
లోకో పైలట్ కోసం ఆధునిక నియంత్రణ, భద్రతా వ్యవస్థలతో కూడిన అధునాతన డ్రైవర్ క్యాబిన్ అందించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!