Vande Bharat Sleeper Train: దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు రెడీ.. ఈ రూట్ లోనే..
- దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్
- జనవరి 17 లేదా 18న ప్రారంభోత్సవం జరిగే అవకాశం
- గౌహతి, కోల్కతా మధ్య పరుగులు తీయనున్నది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ ట్రైన్ ప్రయాణ స్థితినే మార్చేసింది. హై స్పీడ్ తో దూసుకెళ్తూ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తోంది. అయితే ఇప్పటి వరకు వందే భారత్ కార్ చైర్ ట్రైన్స్ మాత్రమే దేశ వ్యాప్తంగా పలు రూట్లలో పరుగులు తీస్తున్నాయి. ఇక ఇప్పుడు దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు రెడీ అయ్యింది. దేశీయంగా నిర్మించిన వందే భారత్ స్లీపర్ రైలు హై-స్పీడ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, కొత్త సంవత్సరం మొదటి రోజే రైల్వేలు దాని మార్గాన్ని ప్రకటించాయి.
Also Read:Vijay-Rashmika : రోమ్ వీధుల్లో విజయ్–రష్మిక రొమాన్స్.. వెనక నుంచి రష్మిక ‘టైట్ హగ్’ పిక్స్ వైరల్!
Also Read
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు గౌహతి, కోల్కతా మధ్య పరుగులు తీయనున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో దీనిని ప్రారంభిస్తారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026 సంస్కరణల సంవత్సరం అని రైల్వే మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం, గౌహతి నుండి కోల్కతాకు వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీ 3AC రైలుకు రూ.2,300, 2 AC రైలుకు రూ.3,000, 1 AC రైలుకు రూ.3,600గా ఉంటుంది.
జనవరిలో దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. జనవరి 17 లేదా 18న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. రాబోయే ఆరు నెలల్లో ఎనిమిది వందే భారత్ స్లీపర్ రైళ్లు, ఈ ఏడాది చివరి నాటికి 12 రైళ్లు వస్తాయని రైల్వే మంత్రి పేర్కొన్నారు.
Also Read:Naveen Chandra : భయానక ప్రపంచంలోకి తీసుకెళ్లిన నవీన్ చంద్ర ‘హనీ’ గ్లింప్స్
వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు
వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్లు ఉంటాయి, వీటిలో 11 థర్డ్ ఎసి, 4 సెకండ్ ఎసి, 1 ఫస్ట్ ఎసి కోచ్లు ఉంటాయి.
ఈ రైలులో మొత్తం 823 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు.
ఇది సెమీ-హై-స్పీడ్ రైలు, దీని డిజైన్ వేగం గంటకు 180 కిలోమీటర్లు.
కోచ్ల మధ్య కదలిక కోసం ఆటోమేటిక్ డోర్స్, వెస్టిబ్యూల్లు ఉన్నాయి.
మెరుగైన సస్పెన్షన్, తక్కువ శబ్దం కారణంగా, రైలు ప్రయాణం మరింత నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ రైలులో ఆర్మర్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్ ఉన్నాయి, ఇది భద్రతను మరింత పెంచుతుంది.
శుభ్రపరచడానికి క్రిమిసంహారక సాంకేతికతను ఉపయోగించారు.
లోకో పైలట్ కోసం ఆధునిక నియంత్రణ, భద్రతా వ్యవస్థలతో కూడిన అధునాతన డ్రైవర్ క్యాబిన్ అందించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!