Kejriwal: అభివృద్ధి పనులకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. బటిండాలో పంజాబ్ ప్రభుత్వం రూ.1125 కోట్ల విలువైన పథకాల శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని మొత్తం 13 సీట్లను ఆప్ కు ఇవ్వాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పనిని చూసి పంజాబ్లో తమకు ఓటేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వచ్చేసారి 117 సీట్లలో 110కి పైగా ఆమ్ ఆది పార్టీకి సీట్లు వస్తాయని తన మనసు చెబుతోందని కేజ్రీవాల్ అన్నారు. అనంతరం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Also: TS Congress: రేపు పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
Also Read
భగవంత్ మాన్ ప్రభుత్వ పనిని చూసి ఇక్కడి ప్రతిపక్షాలన్నీ భయపడుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అందరూ కలిసి కేంద్రం వద్దకు వెళ్లి ఇన్ని పనులు చేస్తున్నారు, ఆపాలని అన్నారని కేజ్రీవాల్ తెలిపారు. దీంతో కేంద్రం నీచమైన పని చేసింది.. పంజాబ్లోని ఆరోగ్యం, రోడ్ల కోసం డబ్బును నిలిపివేసిందని దుయ్యబట్టారు. నాందేడ్ సాహిబ్, హుజూర్ సాహిబ్, పాట్నా సాహిబ్ (ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం కింద) వెళ్లే రైళ్లను తిరస్కరించారు.
Read Also: Hyderabad: పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్.. ఓ వృద్దుడికి తీవ్ర గాయాలు.
కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రజలను అసంతృప్తికి గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూడా చాలా పనులు ఆపేయాలని ప్రయత్నించినా ఒక్క పని కూడా ఆగనివ్వలేదన్నారు. అదేవిధంగా.. పంజాబ్లోని ఒక్క పని కూడా ఆగిపోనివ్వనని.. మూడు కోట్ల మందితో రంగ్లా పంజాబ్ను సృష్టిస్తామన్నారు. ప్రభుత్వం నష్టాల్లో నడుస్తోందని కెప్టెన్ సాహెబ్, బాదల్ సాహెబ్ చెబుతుంటారని ఢిల్లీ సీఎం అన్నారు. మన ప్రభుత్వం ఏర్పడితే అక్కడ వారి లెక్కలు చూడండి.. అంత అవినీతి జరిగిందని విమర్శించారు. రూ.10కి చేసే పనిని రూ.100కి చేస్తున్నారని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!