Team India: భారత్కు ‘అగ్నిపరీక్ష’.. ఇక ప్రతి మ్యాచ్ ఫైనలే! సెమీస్ రేస్లో నిలవాలంటే ఇదే బెస్ట్ సీనారియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది. భారత్కు నేడు తొలి అగ్ని పరీక్ష ఎదురవ్వనుంది. సూపర్ -8 తొలి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా జింబాబ్వే మ్యాచ్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించాలి. అంతేకాదు.. దక్షిణాఫ్రికా vs వెస్ట్ ఇండీస్, భారత్ vs జింబాబ్వే మ్యాచ్లు సైతం భారత్ను ప్రభావితం చేయనున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం గ్రూప్-1 పాయింట్ల పట్టిక చూస్తే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా రెండూ ఒక్కో మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. భారత్, జింబాబ్వే ఖాతాలు ఇంకా తెరవలేదు. అయితే భారత్ నెట్ రన్రేట్ భారీగా మైనస్లో ఉండటం పెద్ద సమస్యగా మారింది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
భారత్ సెమీస్కు చేరాలంటే.. ముందుగా దక్షిణాఫ్రికా వెస్టిండీస్ను ఓడించాలి. నేటి మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై గెలవాలి. అలా జరిగితే దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో సెమీఫైనల్కు చేరుతుంది. భారత్, వెస్టిండీస్ టీమ్లు చెరో 2 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మార్చి 1న జరిగే భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ నేరుగా ‘క్వార్టర్ ఫైనల్’లా మారుతుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు నెట్ రన్రేట్కు సంబంధం లేకుండా సెమీస్కు వెళ్తుంది. భారత్కు ఇదే బెస్ట్ సీనారియో. ఈ దారి తప్పిదో మరో దారి సైతం ఉంది. వెస్టిండీస్ దక్షిణాఫ్రికాను ఓడించి, భారత్ జింబాబ్వేపై గెలిస్తే వెస్టిండీస్ 4 పాయింట్లతో టాప్లో ఉంటుంది. అప్పుడు భారత్ వెస్టిండీస్పై భారీ తేడాతో గెలిచి నెట్ రన్రేట్ పెంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో జింబాబ్వే దక్షిణాఫ్రికాను ఓడించాలి. ఈ ఓటమి స్వల్ప తేడాతో ఉండాలి. అప్పుడు మాత్రమే భారత్కు అవకాశం ఉంటుంది. ఒకవేళ నేడు భారత్ జింబాబ్వే చేతిలో ఓడిపోతే.. సెమీఫైనల్ ఆశలు దాదాపు ముగిసినట్టే. కానీ.. చివరిగా ఒక్క ఆశ మాత్రం మిగిలే ఉంటుంది. దక్షిణాఫ్రికా మిగిలిన రెండు మ్యాచ్లూ గెలిచి 6 పాయింట్లు సాధించాలి. తర్వాత భారత్ వెస్టిండీస్పై భారీ తేడాతో గెలవాలి. అప్పుడు మూడు జట్లు 2 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. నెట్ రన్రేట్ ఆధారంగా ఒక్క జట్టుకే సెమీఫైనల్ అవకాశం ఉంటుంది. ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. మొత్తానికి భారత్కు ఇప్పుడు ఒక్కో మ్యాచ్ ఫైనల్లాంటిదే. ముందుగా జింబాబ్వేపై గెలవడం తప్పనిసరి. భారీ తేడాతో గెలిచి నెట్ రన్రేట్ మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యం. ఏం జరుగుతుందో చూద్దాం..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..