Team India: భారత్కు ‘అగ్నిపరీక్ష’.. ఇక ప్రతి మ్యాచ్ ఫైనలే! సెమీస్ రేస్లో నిలవాలంటే ఇదే బెస్ట్ సీనారియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది. భారత్కు నేడు తొలి అగ్ని పరీక్ష ఎదురవ్వనుంది. సూపర్ -8 తొలి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా జింబాబ్వే మ్యాచ్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించాలి. అంతేకాదు.. దక్షిణాఫ్రికా vs వెస్ట్ ఇండీస్, భారత్ vs జింబాబ్వే మ్యాచ్లు సైతం భారత్ను ప్రభావితం చేయనున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం గ్రూప్-1 పాయింట్ల పట్టిక చూస్తే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా రెండూ ఒక్కో మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. భారత్, జింబాబ్వే ఖాతాలు ఇంకా తెరవలేదు. అయితే భారత్ నెట్ రన్రేట్ భారీగా మైనస్లో ఉండటం పెద్ద సమస్యగా మారింది.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
భారత్ సెమీస్కు చేరాలంటే.. ముందుగా దక్షిణాఫ్రికా వెస్టిండీస్ను ఓడించాలి. నేటి మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై గెలవాలి. అలా జరిగితే దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో సెమీఫైనల్కు చేరుతుంది. భారత్, వెస్టిండీస్ టీమ్లు చెరో 2 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మార్చి 1న జరిగే భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ నేరుగా ‘క్వార్టర్ ఫైనల్’లా మారుతుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు నెట్ రన్రేట్కు సంబంధం లేకుండా సెమీస్కు వెళ్తుంది. భారత్కు ఇదే బెస్ట్ సీనారియో. ఈ దారి తప్పిదో మరో దారి సైతం ఉంది. వెస్టిండీస్ దక్షిణాఫ్రికాను ఓడించి, భారత్ జింబాబ్వేపై గెలిస్తే వెస్టిండీస్ 4 పాయింట్లతో టాప్లో ఉంటుంది. అప్పుడు భారత్ వెస్టిండీస్పై భారీ తేడాతో గెలిచి నెట్ రన్రేట్ పెంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో జింబాబ్వే దక్షిణాఫ్రికాను ఓడించాలి. ఈ ఓటమి స్వల్ప తేడాతో ఉండాలి. అప్పుడు మాత్రమే భారత్కు అవకాశం ఉంటుంది. ఒకవేళ నేడు భారత్ జింబాబ్వే చేతిలో ఓడిపోతే.. సెమీఫైనల్ ఆశలు దాదాపు ముగిసినట్టే. కానీ.. చివరిగా ఒక్క ఆశ మాత్రం మిగిలే ఉంటుంది. దక్షిణాఫ్రికా మిగిలిన రెండు మ్యాచ్లూ గెలిచి 6 పాయింట్లు సాధించాలి. తర్వాత భారత్ వెస్టిండీస్పై భారీ తేడాతో గెలవాలి. అప్పుడు మూడు జట్లు 2 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. నెట్ రన్రేట్ ఆధారంగా ఒక్క జట్టుకే సెమీఫైనల్ అవకాశం ఉంటుంది. ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. మొత్తానికి భారత్కు ఇప్పుడు ఒక్కో మ్యాచ్ ఫైనల్లాంటిదే. ముందుగా జింబాబ్వేపై గెలవడం తప్పనిసరి. భారీ తేడాతో గెలిచి నెట్ రన్రేట్ మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యం. ఏం జరుగుతుందో చూద్దాం..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?