Team India: భారత్కు ‘అగ్నిపరీక్ష’.. ఇక ప్రతి మ్యాచ్ ఫైనలే! సెమీస్ రేస్లో నిలవాలంటే ఇదే బెస్ట్ సీనారియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది. భారత్కు నేడు తొలి అగ్ని పరీక్ష ఎదురవ్వనుంది. సూపర్ -8 తొలి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా జింబాబ్వే మ్యాచ్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించాలి. అంతేకాదు.. దక్షిణాఫ్రికా vs వెస్ట్ ఇండీస్, భారత్ vs జింబాబ్వే మ్యాచ్లు సైతం భారత్ను ప్రభావితం చేయనున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం గ్రూప్-1 పాయింట్ల పట్టిక చూస్తే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా రెండూ ఒక్కో మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. భారత్, జింబాబ్వే ఖాతాలు ఇంకా తెరవలేదు. అయితే భారత్ నెట్ రన్రేట్ భారీగా మైనస్లో ఉండటం పెద్ద సమస్యగా మారింది.
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
భారత్ సెమీస్కు చేరాలంటే.. ముందుగా దక్షిణాఫ్రికా వెస్టిండీస్ను ఓడించాలి. నేటి మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై గెలవాలి. అలా జరిగితే దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో సెమీఫైనల్కు చేరుతుంది. భారత్, వెస్టిండీస్ టీమ్లు చెరో 2 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మార్చి 1న జరిగే భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ నేరుగా ‘క్వార్టర్ ఫైనల్’లా మారుతుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు నెట్ రన్రేట్కు సంబంధం లేకుండా సెమీస్కు వెళ్తుంది. భారత్కు ఇదే బెస్ట్ సీనారియో. ఈ దారి తప్పిదో మరో దారి సైతం ఉంది. వెస్టిండీస్ దక్షిణాఫ్రికాను ఓడించి, భారత్ జింబాబ్వేపై గెలిస్తే వెస్టిండీస్ 4 పాయింట్లతో టాప్లో ఉంటుంది. అప్పుడు భారత్ వెస్టిండీస్పై భారీ తేడాతో గెలిచి నెట్ రన్రేట్ పెంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో జింబాబ్వే దక్షిణాఫ్రికాను ఓడించాలి. ఈ ఓటమి స్వల్ప తేడాతో ఉండాలి. అప్పుడు మాత్రమే భారత్కు అవకాశం ఉంటుంది. ఒకవేళ నేడు భారత్ జింబాబ్వే చేతిలో ఓడిపోతే.. సెమీఫైనల్ ఆశలు దాదాపు ముగిసినట్టే. కానీ.. చివరిగా ఒక్క ఆశ మాత్రం మిగిలే ఉంటుంది. దక్షిణాఫ్రికా మిగిలిన రెండు మ్యాచ్లూ గెలిచి 6 పాయింట్లు సాధించాలి. తర్వాత భారత్ వెస్టిండీస్పై భారీ తేడాతో గెలవాలి. అప్పుడు మూడు జట్లు 2 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. నెట్ రన్రేట్ ఆధారంగా ఒక్క జట్టుకే సెమీఫైనల్ అవకాశం ఉంటుంది. ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. మొత్తానికి భారత్కు ఇప్పుడు ఒక్కో మ్యాచ్ ఫైనల్లాంటిదే. ముందుగా జింబాబ్వేపై గెలవడం తప్పనిసరి. భారీ తేడాతో గెలిచి నెట్ రన్రేట్ మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యం. ఏం జరుగుతుందో చూద్దాం..
తాజావార్తలు
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!