Maldives: మాల్దీవుల నుంచి భారత్కు తిరిగి వచ్చిన మొదటి సైనిక బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాల్దీవులలో ఉన్న భారత సైనిక అధికారుల బృందం స్వదేశానికి తిరిగి వచ్చింది. అలాగే, అక్కడే ఉన్న హెలికాప్టర్ను ఆపరేట్ చేయడానికి భారతీయ పౌరుల బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అయితే, మొదటి భారత సైనిక బృందం ఉపసంహరణకు సంబంధించి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఎలాంటి ధృవీకరణ చేయలేదు. అడ్డూ సిటీలో మోహరించిన భారత సైనికులు తిరిగి భారత్కు చేరుకున్నారని మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (MNDF) మీడియా అధికారి అధాధూ న్యూస్ పోర్టల్కి తెలిపారు. ఇక, వారి స్థానంలోకి సమాన సంఖ్యలో భారతీయ పౌరులు పంపబడ్డారు. ఇక, భారత సైనికులు అక్కడ మోహరించిన హెలికాప్టర్ల మిషన్లను పూర్తి చేస్తారు.
Read Also: Mrunal Thakur: బంపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.. పాన్ ఇండియా స్టార్కు జోడీగా!
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
అయితే, 26 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ ఫిబ్రవరి 26న మాలేకు చేరుకుంది. ఇప్పుడు భారతీయ సైనిక అధికారులను భర్తీ చేస్తుంది.. అడ్డూలో హెలికాప్టర్లను నడుపుతుంది. భారతదేశం కూడా ఈ బృందంతో కొత్త హెలికాప్టర్ను పంపింది. సర్వీస్ చేయాల్సిన పాత హెలికాప్టర్ను రీకాల్ చేసింది. ఈ హెలికాప్టర్తో కూడిన భారత నౌక ఫిబ్రవరి 29న అడ్డూకు చేరుకుంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు బలమైన మద్దతుదారు కావడంతో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అతను భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు. అందుకే ఒక్క భారత సైనిక అధికారిని కూడా తమ దేశంలో ఉండనివ్వబోమని ముయిజ్జూ గతంలో వెల్లడించారు.
Read Also: SIPRI Report : ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా భారత్
ఇక, మే 10 తర్వాత భారత్ కు చెందిన ఆర్మీ సిబ్బంది సివిల్ దుస్తుల్లో కూడా మాల్దీవుల్లో ఉండేందుకు అనుమతించరు అని అధ్యక్షుడు ముయిజ్జూ తెలిపారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని అవలంబించాడు. మాల్దీవుల నుంచి మొత్తం 90 మంది భారతీయ సైనికులను తిరిగి పంపుతానని చెప్పుకొచ్చాడు. ముయిజ్జూ ప్రభుత్వం మాలేలో అత్యాధునిక చైనీస్ పరిశోధన నౌకను ఏర్పాటు చేసింది.. దీంతో చైనా సైన్యంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎంఎన్డీఎఫ్ ఈ పని చేసింది. ఈ ఒప్పందం ప్రకారం చైనా మాల్దీవులకు నాన్-లెథల్ ఆయుధాలను ఉచితంగా అందిస్తుంది.
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి