Congress : కాంగ్రెస్ కు డబుల్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ.. ఐటీ శాఖ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress : కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నుంచి గురువారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖ సమస్యలను మరింత పెంచింది. కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ దాదాపు రూ.1700 కోట్ల నోటీసు ఇచ్చింది. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీకి ఆర్థిక ఆందోళనలు పెరిగాయి. ఆదాయపు పన్ను శాఖ కొత్త డిమాండ్ 2017-18 నుండి 2020-21 వరకు వివరాలు ఇవ్వాలని కోరింది. ఇందులో పెనాల్టీ, వడ్డీ రెండూ ఉంటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ 2021-22 నుండి 2024-25 వరకు ఆదాయపు పునఃమూల్యాంకనం కోసం వేచి ఉంది. దీని కటాఫ్ తేదీ ఆదివారంతో పూర్తవుతుంది. కాంగ్రెస్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖా మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను శాఖ ఈ చర్య అప్రజాస్వామికమని, అన్యాయమని ఆయన అభివర్ణించారు.
Read Also:Chennai Pub accident: పబ్ లో విషాదం.. ముగ్గురు దుర్మరణం.. పలువురికి గాయాలు..!
Also Read
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
కీలక పత్రాలు లేకుండా గురువారం పార్టీకి దాదాపు రూ.1,700 కోట్ల విలువైన నోటీసు పంపారని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ న్యాయవాది వివేక్ తంఖా ఆరోపించారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, అది కూడా లోక్సభ ఎన్నికల సమయంలోనే అన్నారు. నాలుగు సంవత్సరాల పాటు పన్ను అధికారులు తమపై పన్ను రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్లను ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్లతో కూడిన డివిజన్ బెంచ్ మరో ఏడాది పాటు రీవాల్యుయేషన్ను ప్రవేశపెట్టడంలో జోక్యం చేసుకోకూడదని గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత విషయం 2017 నుండి 2021 వరకు అంచనాకు సంబంధించినది.
Read Also:Houthi Rebels: హౌతీ రెబల్స్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు అమెరికా..
గత వారం కొట్టివేసిన మరో పిటిషన్లో, 2014-15 నుండి 2016-17 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి రీవాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించడాన్ని కాంగ్రెస్ పార్టీ సవాలు చేసింది. మార్చి 22న హైకోర్టు ఆ వాదనలను తిరస్కరించింది. పన్ను అధికారం ప్రాథమికంగా తగినంత , ఖచ్చితమైన సాక్ష్యాలను సేకరించిందని, దీనికి తదుపరి విచారణ అవసరమని పేర్కొంది. ఏప్రిల్, 2019లో నలుగురిపై నిర్దిష్ట కాలపరిమితికి మించి జరిపిన పరిశోధనల ఆధారంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 153C (ఇతర వ్యక్తి ఆదాయాన్ని అంచనా వేయడం) కింద చర్య తీసుకున్నట్లు పిటిషన్లో కాంగ్రెస్ వాదించింది.
తాజావార్తలు
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?