నాచారం పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. సురానా వైర్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్వార్డ్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో16 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు భిన్నమైన వార్తలు వస్తున్నాయి.
హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్తక్లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది.
మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి.
హర్యానాలోని సోనిపట్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఆ సమయంలో.. ఫ్యాక్టరీలో ఉన్న సిలిండర్లు మంటలు అంటుకుని పేలాయి. దీంతో.. మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా కార్మికులు మంటల్లో చిక్కుకుని కాలిపోయారు. అయితే.. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీలో మంటల్లో చిక్కుకున్న కార్మికులను కొంతమందిని…
స్కూల్ బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు చిన్నారులకు గాయాలైన ఘటన బీహార్ లోని సరన్ జిల్లాలో జరిగింది. బనియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దధిబాధి గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ వ్యాన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు అర డజను మంది పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి స్థానికులు.. పిల్లలందరినీ బస్సులో నుంచి క్షేమంగా కిందకు దించారు. గాయాలైన పిల్లలను వెంటనే బనియాపూర్ రిఫరల్ ఆసుపత్రిలో…
హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫుట్పాత్ పై ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్ సర్క్యూట్ కారణంగా ఒక షాపులో మంటలు ఎగసిపడగా.. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కాగా.. ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. మొదట మంటలు ఓ గ్యాస్ వెల్డింగ్ షాపు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో…
మహారాష్ట్రలోని నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు ఫ్యాక్టరీల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా విస్ఫోటనం జరిగినట్లుగా తెలుస్తోంది.
పశ్చిమ లండన్లోని హౌన్స్లోలో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా భారతీయ సంతతికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.