Fire Accident: ఢిల్లీ చాందినీ చౌక్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం..
- ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
- మంటలార్పుతున్న 30 ఫైరింజన్లు
- చాందినీ చౌక్లోని మార్వాడీ కత్రాలో సాయంత్రం చెలరేగిన మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
Read Also: Dry Coconut : ఎండు కొబ్బరిని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
ప్రస్తుతం మంటలను ఆర్పే పనులు కొనసాగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో 30 ఎకరాల పచ్చని ప్రాంతం కాలి బూడిదైంది. తూర్పు ఢిల్లీలోని అసిత ఈస్ట్ వెనుక భాగంలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే.. మంటలు ఆరకుండా అలానే అగ్గి రువ్వడంతో ఈరోజు సాయంత్రం 5:15 గంటల ప్రాంతాన భారీగా మంటలు చెలరేగాయి. అయితే.. అసిత ఈస్ట్లోని ప్రాంతంలో సంఘవిద్రోహులు మత్తు పదార్థాలను సేవించిన తర్వాత సిగరేట్లు కాల్చుకునే సమయంలో అగ్గిపుల్లతో నిప్పంటించారని స్థానికులు చెబుతున్నారు. అయితే.. 8 అగ్నిమాపక యంత్రాలు రెండు గంటల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. మొత్తం మీద ఈ అగ్నిప్రమాదంలో 30 ఎకరాల పచ్చని ప్రాంతం కాలి బూడిదైంది.
Read Also: CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్లతో చంద్రబాబు భేటీ.. అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేడిగాలుల పరిస్థితుల కారణంగా అగ్ని ప్రమాదాల సంఘటనలు గణనీయంగా పెరిగాయి. మే మొదటి 20 రోజుల్లోనే తమకు 2,280 అగ్నిప్రమాదాల గురించి కాల్స్ వచ్చాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. పెరిగిన అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి 33 అత్యాధునిక వాటర్ బౌజర్ వాహనాలను ప్రవేశపెట్టామని, అగ్నిమాపక సేవల సామార్థ్యాలను అప్ గ్రేడ్ చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. చాలా అగ్ని ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లే కారణమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!