Fire Accident: ఢిల్లీ చాందినీ చౌక్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం..
- ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
- మంటలార్పుతున్న 30 ఫైరింజన్లు
- చాందినీ చౌక్లోని మార్వాడీ కత్రాలో సాయంత్రం చెలరేగిన మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
Read Also: Dry Coconut : ఎండు కొబ్బరిని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
ప్రస్తుతం మంటలను ఆర్పే పనులు కొనసాగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో 30 ఎకరాల పచ్చని ప్రాంతం కాలి బూడిదైంది. తూర్పు ఢిల్లీలోని అసిత ఈస్ట్ వెనుక భాగంలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే.. మంటలు ఆరకుండా అలానే అగ్గి రువ్వడంతో ఈరోజు సాయంత్రం 5:15 గంటల ప్రాంతాన భారీగా మంటలు చెలరేగాయి. అయితే.. అసిత ఈస్ట్లోని ప్రాంతంలో సంఘవిద్రోహులు మత్తు పదార్థాలను సేవించిన తర్వాత సిగరేట్లు కాల్చుకునే సమయంలో అగ్గిపుల్లతో నిప్పంటించారని స్థానికులు చెబుతున్నారు. అయితే.. 8 అగ్నిమాపక యంత్రాలు రెండు గంటల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. మొత్తం మీద ఈ అగ్నిప్రమాదంలో 30 ఎకరాల పచ్చని ప్రాంతం కాలి బూడిదైంది.
Read Also: CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్లతో చంద్రబాబు భేటీ.. అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేడిగాలుల పరిస్థితుల కారణంగా అగ్ని ప్రమాదాల సంఘటనలు గణనీయంగా పెరిగాయి. మే మొదటి 20 రోజుల్లోనే తమకు 2,280 అగ్నిప్రమాదాల గురించి కాల్స్ వచ్చాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. పెరిగిన అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి 33 అత్యాధునిక వాటర్ బౌజర్ వాహనాలను ప్రవేశపెట్టామని, అగ్నిమాపక సేవల సామార్థ్యాలను అప్ గ్రేడ్ చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. చాలా అగ్ని ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లే కారణమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!