Kanpur : కాన్ఫూర్ లో అగ్ని ప్రమాదం.. 500 బట్టల దుకాణాల్లో మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్ఫూర్ లోని బాస్మండి ప్రాంతంలో శుక్రవారం నాడు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 500 బట్టల దుకాణాల్లో అగ్ని ప్రమాదం నెలకొంది. ఎఆర్ టవర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న కాంప్లెక్స్ లకు వ్యాపించాయి. మసూద్ టవర్-1, మసుద్ టవర్-2, హమ్రాజ్ కాంప్లెక్స్ లకు మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
Also Read : BRS MLC: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్కుమార్, చల్లా
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
మంటలను అదుపు చేసేందుకు సుమారు 25 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. పండుగల సమయంలో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బట్టలు ఈ ప్రమాదంలో దగ్దమయ్యాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో వందలాది దుకాణాలు దగ్ధమైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. లతుష్ రోడ్, మీర్పూర్, ఫజల్గంజ్ మరియు జజ్మౌ వంటి అగ్నిమాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేస్తున్నాయి.
Also Read : Corona Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజులోనే?
లక్నో నుంచి హైడ్రోల్ ఫైర్ బ్రిగేడ్ యంత్రాలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు అంతస్తుల AR టవర్ బన్స్మండిలోని హమ్రాజ్ కాంప్లెక్స్ పక్కన ఉంది. వందల కొద్దీ రెడీమేడ్ బట్టల దుకాణాలు ఉన్నాయి. హమ్రాజ్ కాంప్లెక్స్లోని మొదటి అంతస్తులోని షాపులో మంటలు చెలరేగగా.. మంటలు క్రమంగా ఎగసిపడి పై అంతస్తులో ఉన్న దుకాణాలకు చేరాయి.
Also Read : Allu Arjun: ఇంతకీ అప్డేట్ ఏంటి పుష్ప?
సమాచారం అందిన వెంటనే చీఫ్ ఫైర్ ఆఫీసర్ దీపక్ శర్మతో పాటు లతుష్ రోడ్ ఫైర్ ఆఫీసర్ కైలాష్ చంద్ర, ఫజల్ గంజ్ ఫైర్ ఆఫీసర్ వినోద్ కుమార్ పాండే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు కమిషనర్ బిపి జోగ్దంద్ కూడా తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రధాన అగ్నిమాపక అధికారి దీపక్ శర్మ మాట్లాడుతూ మార్కెట్లో షార్ట్సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచ చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!