TSRTC : కదులుతున్న ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తంతో తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. సిటీ బస్సు శంషాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్కు వెళ్తుండగా బేగంపేట విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇంజన్లో పొగలు రావడంతో బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ప్రయాణికులంతా సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. బస్సులో కొంత భాగం మాత్రమే దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.
Also Read : V.Hanumantha Rao : మంత్రి పదవి కూడా చేయని కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్
Also Read
దీనిపై టీఎస్ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో, కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైనప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. షార్ట్ సర్కూట్తోనే మంటలు అంటుకుని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఆర్టీసీ పెద్ద ఎత్తున విద్యుత్ బస్సులను నడిపేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.
Also Read : Mumbai: ముంబైలో అక్రమ ఫిల్మ్ స్టూడియోలు కూల్చివేత.. బీజేపీ సంబరాలు
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!