Fire Accident : భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి
- భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి
- హుస్సేన్సాగర్లో రెండు బోట్లలో మంటలు
- టపాసులు కాలుస్తుండగా ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : హైదరాబాద్ నగరంలోని ట్యాంక్బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్లో బోట్లపై బాణాసంచా కాల్చుతుండగా, అగ్ని ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో హుస్సేన్ సాగర్లో రెండు బోట్లు మంటల్లో కాలి పోయాయి. ఈ బోట్లలో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తుండగా, వారందరూ బోట్ల నుంచి దూకడంతో సురక్షితంగా బయటపడ్డారు. మంటలను సహాయక బృందాలు వెంటనే అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Best 5G smartphones: రూ. 10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే!
భారత మాతకు మహా హారతి కార్యక్రమం ముగింపునకు దగ్గర్లో ఉండగానే ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, బీజేపీ నేతలు, ప్రముఖ సినీ దర్శకుడు ఎంఎం కీరవాణి, నాగఫణి శర్మ తదితరులు హాజరయ్యారు. కిషన్ రెడ్డి గత కొన్నేళ్లుగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకలను ఆనందించారు. కిషన్ రెడ్డితో పాటు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ భారత మాతకు మహా హారతి కార్యక్రమానికి మానసిక ఉత్సాహాన్ని పంచారు.
Yogi Adityanath: ‘‘సనాతన ధర్మం జాతీయ మతం’’..సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!