Finance Ministry: విమాన ప్రయాణానికి ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇకపై విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్తగా కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఈ నియమాలను రూపొందించింది.
ప్రభుత్వ ఉద్యోగులు విమానాల్లో ట్రావెల్ క్లాసులో అతితక్కువ ధర ఉన్న టికెట్ క్లాస్ నే ఎంచుకోవాలని.. పర్యటనలు, ఎల్టీసీ కోసం వెళ్లే వారు మూడు వారాల కన్నా ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఉద్యోగులు తమ ప్రయాణానికి ఒక్కో టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలని, ఒక వేళ టూర్ ప్రోగ్రాం ఆప్రూవల్ ప్రాసెస్ లో ఉన్నప్పటికీ బుకింగ్ చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆధీకృత ట్రావెల్ ఏజెంట్ల నుండి మాత్రమే విమాన టిక్కెట్లను కొనుగోలు చేయాలని బాల్మెర్ లారీ అండ్ కో, అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్, ఐఆర్సీటీసీ నుంచి మాత్రమే టికెట్ కొనుగోలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
ప్రయాణానికి సంబంధించి 72 గంటలలోపు బుకింగ్ చేసినా.. 24 గంటల కన్నా తక్కువ వ్యవధిలో రద్దు చేసినా.. ఉద్యోగి స్వయంగా జస్టిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకే పర్యటన కోసం ఉద్యోగులంతా ఒకే ట్రావెల్ ఏజెంట్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. ఎల్టీసీ ప్రయాణానికి 21 రోజుల ముందు విమాన టికెట్ ను బుక్ చేసుకోవాలి. అనధికారిక ట్రావెల్ ఏజెంట్లు, వెబ్ సైట్ల నుంచి టికెట్ బుకింగ్ చేసే అనివార్య పరిస్థితులు ఏర్పడితే జాయింట్ సెక్రటరీ లేదా అంత కన్నా ఎక్కువ స్థాయి అధికారి మాత్రమే సడలింపులు మంజూరు చేయాల్సి ఉంటుంది.
ప్రయాణం పూర్తయిన 30 రోజుల్లో ట్రావెట్ ఏజెంట్ కు బకాయిలను చెల్లించాని ఆర్థిక విభాగం అన్ని మంత్రిత్వ శాఖలను కోరింది. ఆగస్ట్ 31, 2022 లోగా ట్రావెల్ ఏజెంట్లకు మంత్రిత్వశాఖలు చెల్లించాల్సిన అన్ని బాకాయిలను క్లియర్ చేయాలి. పెట్రోల్, డిజిల్ పై సుంకాల తగ్గింపు, కొన్ని వస్తువులపై కస్టమ్స్ తగ్గింపు, అధిక ఎరువుల సబ్సిడీలు, పేదలకు ఉచిత ఆహార పథకం కింద ఆర్థిక వ్యయాలు ఎక్కు వ అవుతున్నాయి. దీంతో అనవసరమైన ఖర్చులు తగ్గించాలని మంత్రిత్వ శాఖ చూస్తోంది.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!