Finance Ministry: విమాన ప్రయాణానికి ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
ఇకపై విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్తగా కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఈ నియమాలను రూపొందించింది.
ప్రభుత్వ ఉద్యోగులు విమానాల్లో ట్రావెల్ క్లాసులో అతితక్కువ ధర ఉన్న టికెట్ క్లాస్ నే ఎంచుకోవాలని.. పర్యటనలు, ఎల్టీసీ కోసం వెళ్లే వారు మూడు వారాల కన్నా ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఉద్యోగులు తమ ప్రయాణానికి ఒక్కో టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలని, ఒక వేళ టూర్ ప్రోగ్రాం ఆప్రూవల్ ప్రాసెస్ లో ఉన్నప్పటికీ బుకింగ్ చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆధీకృత ట్రావెల్ ఏజెంట్ల నుండి మాత్రమే విమాన టిక్కెట్లను కొనుగోలు చేయాలని బాల్మెర్ లారీ అండ్ కో, అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్, ఐఆర్సీటీసీ నుంచి మాత్రమే టికెట్ కొనుగోలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read
- Vijay And Karunanidhi: కరుణానిధితో విజయ్ పాత ఫోటో వైరల్.. ఆర్జీవీ సంచలన ట్వీట్..
- Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
- Viral: మమతా బెనర్జీ నన్ను రూ.5 కోట్లు అడిగింది.. ప్రముఖ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన
ప్రయాణానికి సంబంధించి 72 గంటలలోపు బుకింగ్ చేసినా.. 24 గంటల కన్నా తక్కువ వ్యవధిలో రద్దు చేసినా.. ఉద్యోగి స్వయంగా జస్టిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకే పర్యటన కోసం ఉద్యోగులంతా ఒకే ట్రావెల్ ఏజెంట్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. ఎల్టీసీ ప్రయాణానికి 21 రోజుల ముందు విమాన టికెట్ ను బుక్ చేసుకోవాలి. అనధికారిక ట్రావెల్ ఏజెంట్లు, వెబ్ సైట్ల నుంచి టికెట్ బుకింగ్ చేసే అనివార్య పరిస్థితులు ఏర్పడితే జాయింట్ సెక్రటరీ లేదా అంత కన్నా ఎక్కువ స్థాయి అధికారి మాత్రమే సడలింపులు మంజూరు చేయాల్సి ఉంటుంది.
ప్రయాణం పూర్తయిన 30 రోజుల్లో ట్రావెట్ ఏజెంట్ కు బకాయిలను చెల్లించాని ఆర్థిక విభాగం అన్ని మంత్రిత్వ శాఖలను కోరింది. ఆగస్ట్ 31, 2022 లోగా ట్రావెల్ ఏజెంట్లకు మంత్రిత్వశాఖలు చెల్లించాల్సిన అన్ని బాకాయిలను క్లియర్ చేయాలి. పెట్రోల్, డిజిల్ పై సుంకాల తగ్గింపు, కొన్ని వస్తువులపై కస్టమ్స్ తగ్గింపు, అధిక ఎరువుల సబ్సిడీలు, పేదలకు ఉచిత ఆహార పథకం కింద ఆర్థిక వ్యయాలు ఎక్కు వ అవుతున్నాయి. దీంతో అనవసరమైన ఖర్చులు తగ్గించాలని మంత్రిత్వ శాఖ చూస్తోంది.
తాజావార్తలు
-
Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
-
T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
-
Vijay And Karunanidhi: కరుణానిధితో విజయ్ పాత ఫోటో వైరల్.. ఆర్జీవీ సంచలన ట్వీట్..
-
Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
-
KTR : రైతు సమస్యలపై ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!