Finance Ministry: విమాన ప్రయాణానికి ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇకపై విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్తగా కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఈ నియమాలను రూపొందించింది.
ప్రభుత్వ ఉద్యోగులు విమానాల్లో ట్రావెల్ క్లాసులో అతితక్కువ ధర ఉన్న టికెట్ క్లాస్ నే ఎంచుకోవాలని.. పర్యటనలు, ఎల్టీసీ కోసం వెళ్లే వారు మూడు వారాల కన్నా ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఉద్యోగులు తమ ప్రయాణానికి ఒక్కో టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలని, ఒక వేళ టూర్ ప్రోగ్రాం ఆప్రూవల్ ప్రాసెస్ లో ఉన్నప్పటికీ బుకింగ్ చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆధీకృత ట్రావెల్ ఏజెంట్ల నుండి మాత్రమే విమాన టిక్కెట్లను కొనుగోలు చేయాలని బాల్మెర్ లారీ అండ్ కో, అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్, ఐఆర్సీటీసీ నుంచి మాత్రమే టికెట్ కొనుగోలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ప్రయాణానికి సంబంధించి 72 గంటలలోపు బుకింగ్ చేసినా.. 24 గంటల కన్నా తక్కువ వ్యవధిలో రద్దు చేసినా.. ఉద్యోగి స్వయంగా జస్టిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకే పర్యటన కోసం ఉద్యోగులంతా ఒకే ట్రావెల్ ఏజెంట్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. ఎల్టీసీ ప్రయాణానికి 21 రోజుల ముందు విమాన టికెట్ ను బుక్ చేసుకోవాలి. అనధికారిక ట్రావెల్ ఏజెంట్లు, వెబ్ సైట్ల నుంచి టికెట్ బుకింగ్ చేసే అనివార్య పరిస్థితులు ఏర్పడితే జాయింట్ సెక్రటరీ లేదా అంత కన్నా ఎక్కువ స్థాయి అధికారి మాత్రమే సడలింపులు మంజూరు చేయాల్సి ఉంటుంది.
ప్రయాణం పూర్తయిన 30 రోజుల్లో ట్రావెట్ ఏజెంట్ కు బకాయిలను చెల్లించాని ఆర్థిక విభాగం అన్ని మంత్రిత్వ శాఖలను కోరింది. ఆగస్ట్ 31, 2022 లోగా ట్రావెల్ ఏజెంట్లకు మంత్రిత్వశాఖలు చెల్లించాల్సిన అన్ని బాకాయిలను క్లియర్ చేయాలి. పెట్రోల్, డిజిల్ పై సుంకాల తగ్గింపు, కొన్ని వస్తువులపై కస్టమ్స్ తగ్గింపు, అధిక ఎరువుల సబ్సిడీలు, పేదలకు ఉచిత ఆహార పథకం కింద ఆర్థిక వ్యయాలు ఎక్కు వ అవుతున్నాయి. దీంతో అనవసరమైన ఖర్చులు తగ్గించాలని మంత్రిత్వ శాఖ చూస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!