Manchivallaku Manchivadu : యాభై ఏళ్ళ ‘మంచివాళ్ళకు మంచివాడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో ‘కౌబోయ్’ అన్న మాట వినగానే ముందుగా గుర్తుకు వచ్చే హీరో ఎవరంటే నటశేఖర కృష్ణ పేరే వినిపిస్తుంది. కృష్ణ హీరోగా రూపొందిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ తెలుగునాట తొలి కౌబోయ్ మూవీగా జేజేలు అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో వరుసగా కృష్ణతో ఆ తరహా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. అలా కృష్ణతో “మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, మావూరి మొనగాళ్ళు” వంటి కౌబోయ్ మూవీస్ వచ్చాయి కానీ, అంతగా అలరించలేక పోయాయి. ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్ర దర్శకుడు కె.యస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన రంగుల చిత్రం ‘మంచివాళ్ళకు మంచివాడు’ కూడా కౌబోయ్ మూవీగా ఆదరణ పొందింది. 1973 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనం ముందు నిలచింది. శ్రీవేంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై కృష్ణ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది.
ధర్మపురి జమీందార్ ధర్మారాయుడు ప్రజలు కష్టాల్లో ఉన్నసమయంలో ఉపయోగపడుతుందని ఓ నిధిని దాచిపెట్టి ఉంటాడు. ఆయన గతించిన తరువాత ఆ నిధిని దోచుకోవాలని వారి దాయాది సేతుపతి ప్రయత్నిస్తాడు. యువరాజు కుమారరాజాను ఎత్తుకు వెళతారు. అంగరక్షకుడు నాగమనాయుని కాలుస్తారు. అతను చనిపోతూ నిధికి దారి చూపే పతకాన్ని రంగా అనే యువకునికి అందిస్తాడు. నాగమనాయునికి ఆశ్రయమిచ్చిన వారందరినీ సేతుపతి చంపుతూ వస్తాడు. అలా కన్నవారిని పోగొట్టుకున్న ఓబయ్య, రంగా కలుసుకుంటారు. తమ కన్నవారిని పొట్టన పెట్టుకున్నవారిపై పగ సాధించడానికి వారిద్దరూ ఓ పథకం వేస్తారు. వారికి తుపాకి సాకీ అనే అమ్మాయి సహకరిస్తుంది. సేతుపతి నిధి కోసం పలువురిని చంపుతాడు. కొందరు దొంగలతో దోస్తీ చేస్తాడు. వాడు చివరకు రంగ, ఓబయ్యకు దొరుకుతాడు. ఓబయ్య వాడిని చంపేసి తన పగ తీర్చుకుంటాడు. అలాగే సేతుపతి దగ్గర ఉన్న కుమార రాజాను రక్షిస్తాడు. తమకు సాయం చేసిన తుపాకి సాఖి అసలు పేరు ప్రియంవదా దేవి అని, ఆమె జమీందారు వారసురాలని తెలుస్తుంది. ఎంతోమంది పేద ప్రజలకు చెందవలసిన నిధిని రక్షించిన రంగాతోనే ప్రియంవద జోడీ కట్టడంతో కథ ముగుస్తుంది.
Also Read
కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ చిత్రంలో నగేశ్, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, జగ్గారావు, రావు గోపాలరావు, సాక్షి రంగారావు, సిహెచ్. నారాయణరావు, నిర్మల, హలం, కాకరాల, ఉదయలక్ష్మి, షబ్నమ్, వల్లూరి బాలకృష్ణ, గోకిన రామారావు, మాస్టర్ రాము ముఖ్యపాత్రధారులు. ఈ చిత్ర నిర్మాత యస్. భావనారాయణ సమకూర్చిన కథకు పాలగుమ్మి పద్మరాజు, అప్పలరాజు మాటలు రాశారు. సత్యం స్వరకల్పన చేసిన ఈ చిత్రంలో శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఆరుద్ర పాటలు పలికించారు. ఇందులోని “పిల్లా…షోకిల్లా…”, “ఏమయ్యో మొనగాడా…”, “వెండి మబ్బు విడిచింది…”, “లేనే లేదా అంతం…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్థాయిలో అలరించకున్నా, ఆ తరువాత ఆకట్టుకున్న తెలుగు కౌబోయ్ మూవీగా నిలచింది. రిపీట్ రన్స్ లోనూ ఆదరణ చూరగొంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!