Road Accident : రక్తసిక్తమైన రోడ్లు.. వేర్వేరు యాక్సిడెంట్లలో ఐదుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident : సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. హుజూర్ నగర్ – మిర్యాల గూడ జాతీయ రహదారి పై బైకు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధి లోని రామాపురానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి బైక్ పై మిర్యాలగూడ వెళ్తున్నారు. రామగిరి వద్ద లారీని బైక్ ఢీకొట్టడంతో సత్యనారాయణ అతడి కుమారుడు అక్కడికక్కడే చనిపోయారు. ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Pushpa 2 : అక్కడ ఇక్కడ ఒకే సారి తగ్గేదేలే.. అంటున్న అల్లు అర్జున్
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దషాపూర్ తండా వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గోపాల్(47), అంజలి(42), స్వాతి(09)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!