Constable Exam Paper Leak: కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్.. విచారణ చేపట్టిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Exam Paper Leak: హిమాచల్ ప్రదేశ్లో కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్పై సీబీఐ విచారణ చేపట్టింది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ విషయాలు వెలుగులోకి వచ్చిన అనంతరం రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐ కేసును స్వీకరించింది. సీబీఐ నవంబర్ 30న రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి, పత్రాల కోసం హిమాచల్ ప్రదేశ్ పోలీసులను కోరిందని, వాటిని ఒకటి లేదా రెండు రోజుల్లో దర్యాప్తు సంస్థకు అందజేసే అవకాశం ఉందని రాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. మే 5న లీక్ వెలుగులోకి రావడంతో మరుసటి రోజు పరీక్షను రద్దు చేశారు. మే 7న సిట్ను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం మే 18న సీబీఐ విచారణకు సమ్మతి తెలిపింది.
గగ్గల్ (కాంగ్రా), ఆర్కి (సోలన్), భరారీ (సిమ్లా)లోని సీఐడీ పోలీస్ స్టేషన్లలో లీక్కు సంబంధించి రాష్ట్ర పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.1,334 కానిస్టేబుల్ పోస్టులకు 1,87,476 దరఖాస్తులు రాగా, 75,803 మంది అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లలో అర్హత సాధించారు. వీరిలో 26,346 మంది అభ్యర్థులు మార్చి 27న 11 జిల్లాల్లోని 81 కేంద్రాల్లో జరిగిన రాత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని, ప్రశ్నపత్రాలను లీక్ చేసిన పేపర్ కట్టర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, కింగ్పిన్లు, ఏజెంట్లు, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులతో సహా ఇప్పటివరకు 253 మందిని సిట్ అరెస్టు చేసింది. 150 మంది నిందితులపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో పలు ముఠాలు పాల్గొన్నాయని, సాధారణ నేరస్థులు, ఇంజనీర్లు, రైల్వే, ఆదాయపన్ను శాఖల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఇందులో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు.
Also Read
- Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
US-Made Weapon: నక్సల్స్ వద్ద అమెరికా ఆయుధం.. ఆ అత్యాధునిక రైఫిల్స్ను ఎలా సంపాదించారు?
కింగ్పిన్లు తమ ప్రజలను దేశవ్యాప్తంగా ప్రింటింగ్ ప్రెస్లలో నియమించుకున్నారని.. గతంలో అనేక పేపర్లను లీక్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి 80 ప్రశ్నల ఫైనల్ ప్రింట్ లీక్ అయిందని, పేపర్ల ప్రింటింగ్ను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించిన ప్రింటింగ్ కమిటీ సభ్యుడు స్కానర్లో ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసు విచారణ కోసం బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ను కూడా ఏర్పాటు చేశారు. నవంబర్ 12న జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు ప్రధాన సమస్యగా మారింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!