Father Funeral Rites: ఇంత ఘోరం ఏంట్రా? తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసేందుకు ప్రయత్నించిన కొడుకులు
- తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసేందుకు ప్రయత్నించిన కొడుకులు
- మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ జిల్లా లిధౌరా తాల్ గ్రామంలో ఘటన.
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన విషయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Funeral Rites: మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ జిల్లా లిధౌరా తాల్ గ్రామంలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ఇద్దరు కుమారులు దామోదర్, కిషన్ సింగ్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ వివాదం ఎంతంగా ముదిరందంటే.. చివరకు తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరూ విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించేంతగా. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం ధ్యాని సింగ్ మృతి చెందారు. ఆ తర్వాత చిన్న కుమారుడు దామోదర్ తన తండ్రి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసి గ్రామస్థులను, బంధువులను ఆహ్వానించాడు. ఇదే సమయంలో పెద్ద కుమారుడు కిషన్ సింగ్ ఘోష్ కూడా వచ్చి తండ్రి అంత్యక్రియలు తాను నిర్వహిస్తానని అన్నాడు. అయితే, తండ్రి చివరి రోజులు తనతో గడిపాడనే కారణంతో దామోదర్ ఈ విషయాన్ని అంగీకరించలేదు.
Also Read: CM Chandrababu: నేడు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ భేటీ.. ఆ పథకాలపై సీఎం కసరత్తు..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఇంకేముంది ఆ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్తా తీవ్ర గొడవగా మారింది. గ్రామస్తులు, బంధువులు అన్నదమ్ములిద్దరూ కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని నచ్చజెప్పినా కిషన్ సింగ్ ఒప్పుకోలేదు. చివరికి, తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి, ఇద్దరూ తమకు నచ్చినట్లుగా అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. అక్కడి పరిస్థితిని చూసిన గ్రామస్థులు భయభ్రాంతులకు గురై, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దానితో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం, అంత్యక్రియల బాధ్యతలను పెద్ద కుమారుడు కిషన్ సింగ్ ఘోష్కు అప్పగించారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగి చివరకు ధ్యాని సింగ్ ఘోష్ అంత్యక్రియలు సజావుగా పూర్తయ్యాయి.
Also Read: TGCHE: ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారా?.. ఇకపై ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజు
ఈ ఘటన కుటుంబ విభేదాలు ఎంతకైనా దారి తీస్తాయనే దానికి ఒక ఉదాహరణ. తండ్రి అంత్యక్రియల సమయంలో కూడా సోదరులు ఓకటిగా ఉండలేకపోవడం, మృతదేహాన్ని సైతం విడగొట్టాలనే ఆలోచనకు రావడం నిజంగా విచారకరం. కుటుంబ కలహాలను అధిగమించి, సమర్థవంతమైన పరిష్కార మార్గాలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సంఘటన నిదర్శనం.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!