TGCHE: ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారా?.. ఇకపై ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజు
- ప్రాథమిక కీపై అభ్యంతరాలపై తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం
- ప్రవేశ పరీక్షల్లో ఆన్సర్ కీ ఛాలెంజ్ చేస్తే ఒక్కోప్రశ్నకు రూ. 500 ఫీజు
- విద్యార్థి సంఘాల మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యా్ర్థులు ఎట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎప్ సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీని రిలీజ్ చేస్తుంటారు అధికారులు. ఇక ఈ కీపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు సూచిస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కొత్త సమస్య మొదలవుతోంది. ఇప్పటి వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎలాంటి ఫీజులు వసూలు చేసే వారు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ఫీజులు వసూలు చేయబోతున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
ఇకపై ప్రవేశ పరీక్షల్లో ఆన్సర్ కీ ఛాలెంజ్ చేస్తే ఒక్కోప్రశ్నకు రూ. 500 ఫీజు వసూలు చేయనున్నట్లు నిర్ణయించింది. ఎన్ని ప్రశ్నలకు ఛాలెంజ్ చేస్తే ప్రతి ప్రశ్నకు రూ. 500 చెల్లించాల్సిందే. విద్యార్థులకు నష్టం కలిగించే ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ప్రాథమిక కీ ఛాలెంజ్ లో ఒక్కో ప్రశ్నకు రూ. 200 మాత్రమే వసూలు చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం రూ. 500 వసూలు చేయడం గమనార్హం.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
అయితే ఇక్కడ విద్యార్థులకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. ఇది రీఫండబుల్ ఫీజు అని అధికారులు తెలిపారు. అంటే విద్యార్థులు ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తే దాని సమాధానం తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి చెల్లిస్తారు. ఒక వేళ ఆన్సర్ కరెక్ట్ అయితే ఫీజు తిరిగి ఇవ్వరు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు ధైర్యంగా ప్రాథమిక కీపై ఛాలెంజ్ చేసే పరిస్థితి లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరిస్తున్నాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!