TGCHE: ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారా?.. ఇకపై ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజు
- ప్రాథమిక కీపై అభ్యంతరాలపై తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం
- ప్రవేశ పరీక్షల్లో ఆన్సర్ కీ ఛాలెంజ్ చేస్తే ఒక్కోప్రశ్నకు రూ. 500 ఫీజు
- విద్యార్థి సంఘాల మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యా్ర్థులు ఎట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎప్ సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీని రిలీజ్ చేస్తుంటారు అధికారులు. ఇక ఈ కీపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు సూచిస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కొత్త సమస్య మొదలవుతోంది. ఇప్పటి వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎలాంటి ఫీజులు వసూలు చేసే వారు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ఫీజులు వసూలు చేయబోతున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
ఇకపై ప్రవేశ పరీక్షల్లో ఆన్సర్ కీ ఛాలెంజ్ చేస్తే ఒక్కోప్రశ్నకు రూ. 500 ఫీజు వసూలు చేయనున్నట్లు నిర్ణయించింది. ఎన్ని ప్రశ్నలకు ఛాలెంజ్ చేస్తే ప్రతి ప్రశ్నకు రూ. 500 చెల్లించాల్సిందే. విద్యార్థులకు నష్టం కలిగించే ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ప్రాథమిక కీ ఛాలెంజ్ లో ఒక్కో ప్రశ్నకు రూ. 200 మాత్రమే వసూలు చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం రూ. 500 వసూలు చేయడం గమనార్హం.
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
అయితే ఇక్కడ విద్యార్థులకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. ఇది రీఫండబుల్ ఫీజు అని అధికారులు తెలిపారు. అంటే విద్యార్థులు ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తే దాని సమాధానం తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి చెల్లిస్తారు. ఒక వేళ ఆన్సర్ కరెక్ట్ అయితే ఫీజు తిరిగి ఇవ్వరు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు ధైర్యంగా ప్రాథమిక కీపై ఛాలెంజ్ చేసే పరిస్థితి లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరిస్తున్నాయి.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..