TGCHE: ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారా?.. ఇకపై ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజు
- ప్రాథమిక కీపై అభ్యంతరాలపై తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం
- ప్రవేశ పరీక్షల్లో ఆన్సర్ కీ ఛాలెంజ్ చేస్తే ఒక్కోప్రశ్నకు రూ. 500 ఫీజు
- విద్యార్థి సంఘాల మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యా్ర్థులు ఎట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎప్ సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీని రిలీజ్ చేస్తుంటారు అధికారులు. ఇక ఈ కీపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు సూచిస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కొత్త సమస్య మొదలవుతోంది. ఇప్పటి వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎలాంటి ఫీజులు వసూలు చేసే వారు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ఫీజులు వసూలు చేయబోతున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
ఇకపై ప్రవేశ పరీక్షల్లో ఆన్సర్ కీ ఛాలెంజ్ చేస్తే ఒక్కోప్రశ్నకు రూ. 500 ఫీజు వసూలు చేయనున్నట్లు నిర్ణయించింది. ఎన్ని ప్రశ్నలకు ఛాలెంజ్ చేస్తే ప్రతి ప్రశ్నకు రూ. 500 చెల్లించాల్సిందే. విద్యార్థులకు నష్టం కలిగించే ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ప్రాథమిక కీ ఛాలెంజ్ లో ఒక్కో ప్రశ్నకు రూ. 200 మాత్రమే వసూలు చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం రూ. 500 వసూలు చేయడం గమనార్హం.
Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
అయితే ఇక్కడ విద్యార్థులకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. ఇది రీఫండబుల్ ఫీజు అని అధికారులు తెలిపారు. అంటే విద్యార్థులు ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తే దాని సమాధానం తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి చెల్లిస్తారు. ఒక వేళ ఆన్సర్ కరెక్ట్ అయితే ఫీజు తిరిగి ఇవ్వరు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు ధైర్యంగా ప్రాథమిక కీపై ఛాలెంజ్ చేసే పరిస్థితి లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరిస్తున్నాయి.
తాజావార్తలు
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!