Viral: హృదయ విదారకం.. కూతురి మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: సాంకేతికంగా ఎంత ముందుకు పోతున్నా సామాన్యుడికి కనీస వసతులు కరువయ్యాయి. అంబులెన్స్కు డబ్బులు చెల్లించే స్థోమత లేక ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించిన ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ తండ్రి తన కూతురి మృతదేహాన్ని కొన్ని కిలోమీటర్ల మేర బైక్పైనే తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also:Summer Effect in Telugu States Live: రికార్డులను తిరగరాస్తున్న ఎండలు.. ఏంచేయాలి?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లా.. కోట గ్రామానికి చెందిన లక్ష్మణ్ సింగ్ గౌడ్ కుమార్తె మాధురి గౌడ్ మే 12న అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను అదే రోజు షాదోల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సికెల్ సెల్ రోగంతో బాధపడుతున్న మాధురి రెండు రోజుల చికిత్స తర్వాత ప్రాణాలు కోల్పోయింది. డెడ్బాడీని కోట గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చాలని హాస్పిటల్ డాక్టర్లను తన కుటుంబ సభ్యులు వేడుకున్నారు. కానీ వార విన్నపాన్ని పట్టించుకోలేదు. 15 కిలోమీటర్ల వరకు మాత్రమే అంబులెన్స్ను సమకూర్చుతామని, 70 కిలోమీటర్ల వరకు అంటే కష్టం అని చెప్పారు.
Read Also:PM Modi: ఆరు రోజుల పాటు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ..
దీంతో లక్ష్మణ్ సింగ్ తన కుమార్తె మృతదేహాన్ని బంధువు సహాయంతో బైక్పైనే తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కలెక్టర్ వందన స్పందించారు. లక్ష్మణ్ సింగ్ను మార్గమధ్యంలోనే ఆపారు. జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ జీఎస్ పరిహార్కు ఫోన్ చేసి, అంబులెన్స్ సమకూర్చాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్ సమకూర్చి, మాధురి డెడ్బాడీని స్వగ్రామానికి తరలించారు. ఆ కుటుంబానికి కలెక్టర్ ఆర్థికసాయం అందించారు.
MP | Shahdol
लक्षमण सिंह गोंड (आदिवासी) की 13 साल की बेटी माधुरी की सिकल सेल बीमारी से मौत हो गई।
एंबुलेंस मांगने पर अस्पताल में कहा: अनुमति 15 किमी तक की है 70 किमी के लिए अपना इंतज़ाम करो।
प्राइवेट एंबुलेंस बजट में नहीं था तो लक्षमण बेटी का शव बाइक पर लेकर चल पड़े।
1/2 pic.twitter.com/aFDBp4DgLu
— काश/if Kakvi (@KashifKakvi) May 16, 2023
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!