Madhya Pradesh: ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, ఏడుగురి దుర్మరణం
- మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- నుంజ ఖమ్హారియా గ్రామ సమీపంలో ఆటోను ఢీకొన్న ట్రక్కు
- అనంతరం ఆటోపై బోల్తాపడ్డ ట్రక్కు
- ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి
- మరో ఆరుగురికి తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Jani Master :జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
మృతులు, క్షతగాత్రులందరూ ప్రతాపూర్ వాసులేనని చెబుతున్నారు. కాగా.. ఈ ప్రమాదంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో బైటాయించి రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రమాదంపై అధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో… సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
Read Also: Dengue: డెంగ్యూ వచ్చిందా?.. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి!
అనంతరం.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు కూలీలను జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ హాస్పిటల్కు తరలించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మరోవైపు.. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!