Punjab Farmers Protest: పంజాబ్లో రైతుల ‘రైల్ రోకో’ నిరసన.. ఆదుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో రైతు సంఘాలు రైల్ రోకో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గురువారం నుంచి మూడు రోజుల పాటు నిరసనకు దిగారు. రైలు పట్టాలపై కూర్చుని రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవలే వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక ప్యాకేజీ, కనీస మద్దతు ధర (ఎంఎస్పి) చెల్లుబాటు అయ్యే హామీ, రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫరీద్కోట్లో రైతులు రహదారిని దిగ్బంధించారు.
Kiran Abbavaram: హీరో గృహప్రవేశం.. పూలు కడుతూ కనిపించిన హీరోయిన్..
Also Read
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
గురువారం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, వారితో పాటు 18 రైతు సంఘాలు ఫిరోజ్పూర్ కెంట్ రైల్వే స్టేషన్లో రైళ్లను అడ్డుకున్నారు. అంతేకాకుండా గురుదాస్పూర్-బటాలా మధ్య రైతులు నిరసనల్లో పాల్గొ్న్నారు. రైతులు నిరసనలు చేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మోగా, హోషియార్పూర్, గురుదాస్పూర్, జలంధర్, టార్న్ తరణ్, సంగ్రూర్, పాటియాలా, ఫిరోజ్పూర్, బటిండా మరియు అమృత్సర్లలో రైతులు నిరసనలు తెలిపేందుకు యత్నించారు. అమృత్సర్లోని దేవిదాస్పురాలోని అమృత్సర్-ఢిల్లీ రైల్వే ట్రాక్పై కూర్చుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి, భారతీ కిసాన్ యూనియన్ (BKU-క్రాంతికారి), BKU (ఏక్తా ఆజాద్), ఆజాద్ కిసాన్ సమితి దోబా, BKU (బెహ్రామ్కే), BKU (షహీద్ భగత్ సింగ్), BKU (ఛోటూ రామ్) సహా అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి.
Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం
ఈ సందర్భంగా అమృత్సర్లో రైతు నాయకుడు గుర్బచన్ సింగ్ మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాలకు రూ. 50 వేల కోట్ల వరద సహాయ ప్యాకేజీ, ఎంఎస్పి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, కూలీలకు మొత్తం రుణాలను మాఫీ చేయాలని అన్నారు. అంతే కాకుండా.. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలో మరణించిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!