Punjab Farmers Protest: పంజాబ్లో రైతుల ‘రైల్ రోకో’ నిరసన.. ఆదుకోవాలని డిమాండ్
పంజాబ్లో రైతు సంఘాలు రైల్ రోకో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గురువారం నుంచి మూడు రోజుల పాటు నిరసనకు దిగారు. రైలు పట్టాలపై కూర్చుని రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవలే వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక ప్యాకేజీ, కనీస మద్దతు ధర (ఎంఎస్పి) చెల్లుబాటు అయ్యే హామీ, రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫరీద్కోట్లో రైతులు రహదారిని దిగ్బంధించారు.
Kiran Abbavaram: హీరో గృహప్రవేశం.. పూలు కడుతూ కనిపించిన హీరోయిన్..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
గురువారం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, వారితో పాటు 18 రైతు సంఘాలు ఫిరోజ్పూర్ కెంట్ రైల్వే స్టేషన్లో రైళ్లను అడ్డుకున్నారు. అంతేకాకుండా గురుదాస్పూర్-బటాలా మధ్య రైతులు నిరసనల్లో పాల్గొ్న్నారు. రైతులు నిరసనలు చేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మోగా, హోషియార్పూర్, గురుదాస్పూర్, జలంధర్, టార్న్ తరణ్, సంగ్రూర్, పాటియాలా, ఫిరోజ్పూర్, బటిండా మరియు అమృత్సర్లలో రైతులు నిరసనలు తెలిపేందుకు యత్నించారు. అమృత్సర్లోని దేవిదాస్పురాలోని అమృత్సర్-ఢిల్లీ రైల్వే ట్రాక్పై కూర్చుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి, భారతీ కిసాన్ యూనియన్ (BKU-క్రాంతికారి), BKU (ఏక్తా ఆజాద్), ఆజాద్ కిసాన్ సమితి దోబా, BKU (బెహ్రామ్కే), BKU (షహీద్ భగత్ సింగ్), BKU (ఛోటూ రామ్) సహా అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి.
Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం
ఈ సందర్భంగా అమృత్సర్లో రైతు నాయకుడు గుర్బచన్ సింగ్ మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాలకు రూ. 50 వేల కోట్ల వరద సహాయ ప్యాకేజీ, ఎంఎస్పి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, కూలీలకు మొత్తం రుణాలను మాఫీ చేయాలని అన్నారు. అంతే కాకుండా.. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలో మరణించిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!