Punjab Farmers Protest: పంజాబ్లో రైతుల ‘రైల్ రోకో’ నిరసన.. ఆదుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో రైతు సంఘాలు రైల్ రోకో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గురువారం నుంచి మూడు రోజుల పాటు నిరసనకు దిగారు. రైలు పట్టాలపై కూర్చుని రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవలే వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక ప్యాకేజీ, కనీస మద్దతు ధర (ఎంఎస్పి) చెల్లుబాటు అయ్యే హామీ, రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫరీద్కోట్లో రైతులు రహదారిని దిగ్బంధించారు.
Kiran Abbavaram: హీరో గృహప్రవేశం.. పూలు కడుతూ కనిపించిన హీరోయిన్..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
గురువారం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, వారితో పాటు 18 రైతు సంఘాలు ఫిరోజ్పూర్ కెంట్ రైల్వే స్టేషన్లో రైళ్లను అడ్డుకున్నారు. అంతేకాకుండా గురుదాస్పూర్-బటాలా మధ్య రైతులు నిరసనల్లో పాల్గొ్న్నారు. రైతులు నిరసనలు చేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మోగా, హోషియార్పూర్, గురుదాస్పూర్, జలంధర్, టార్న్ తరణ్, సంగ్రూర్, పాటియాలా, ఫిరోజ్పూర్, బటిండా మరియు అమృత్సర్లలో రైతులు నిరసనలు తెలిపేందుకు యత్నించారు. అమృత్సర్లోని దేవిదాస్పురాలోని అమృత్సర్-ఢిల్లీ రైల్వే ట్రాక్పై కూర్చుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి, భారతీ కిసాన్ యూనియన్ (BKU-క్రాంతికారి), BKU (ఏక్తా ఆజాద్), ఆజాద్ కిసాన్ సమితి దోబా, BKU (బెహ్రామ్కే), BKU (షహీద్ భగత్ సింగ్), BKU (ఛోటూ రామ్) సహా అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి.
Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం
ఈ సందర్భంగా అమృత్సర్లో రైతు నాయకుడు గుర్బచన్ సింగ్ మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాలకు రూ. 50 వేల కోట్ల వరద సహాయ ప్యాకేజీ, ఎంఎస్పి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, కూలీలకు మొత్తం రుణాలను మాఫీ చేయాలని అన్నారు. అంతే కాకుండా.. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలో మరణించిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!