Tummala Nageswara Rao : రైతులకు రూ. 7600 కోట్లు రైతుబంధు చెల్లించాం
- 7600 కోట్ల రైతు బంధు బకాయిలు చెల్లింపు
- పంట నష్ట పరిహారం, మద్దతు ధరలతో రైతులకు భరోసా కలిగించిన ప్రస్తుత ప్రభుత్వం
- బీఆర్ఎస్ పాలన వైఫల్యాలపై మంత్రి తుమ్మల విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao : రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న రైతుబంధు రూ. 7600 కోట్లు చెల్లించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ ఇచ్చే స్థితిలో కూడా లేని పరిస్థితి నుంచి, ఇప్పుడు రైతులకు అన్ని వనరులు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని, అధికారులను అక్కడికే వెళ్లొద్దని ఆదేశించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపోయిన రైతులకు నేరుగా పరిహారాలు అందించామని చెప్పారు. వ్యవసాయ యాంత్రికీకరణ, పంటల భీమా, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల చేయకుండా కేంద్రం 2,500 కోట్లు ఆపేయడాన్ని విమర్శించారు. గతంలో రుణమాఫీ కూడా పూర్తిగా అమలు కాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా 2014లో ప్రకటించి 2018లో సగం మందికే చెల్లించిందన్నారు.
Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం.. అడ్డుకుంటే కోర్టుకు పోదాం..
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం రూ. 40,683 కోట్ల వ్యయం చేసి, మద్దతు ధరలు కల్పించిందన్నారు. సన్న రకాలకు ఎకరాకు రూ. 500 బోనస్ ప్రకటించి, పీడీఎస్ ద్వారా పంపిణీ ద్వారా పేద రైతులకు మేలు చేసినట్లు వివరించారు. కందులు, సోయాబీన్, జొన్న వంటి పంటల దిగుబడుల పరిమితిని పెంచి ప్రభుత్వమే కొనుగోలు చేసిందని తెలిపారు. రైతు భీమా కొనసాగిస్తూ, 2023 కంటే ఎక్కువ మంది రైతులను భీమా పరిధిలోకి తీసుకురాగలిగామని చెప్పారు. రైతుల ప్రీమియంలను కూడా ప్రభుత్వం చెల్లిస్తోందని పేర్కొన్నారు. మట్టి పరీక్షలు, శిక్షణ కార్యక్రమాలు, డ్రిప్ పరికరాల పంపిణీ వంటి అన్ని పథకాలు పునరుద్ధరించామన్నారు.
బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయి రైతు పేరుతో విషప్రచారం చేస్తున్నారని, ఇది ప్రజలు నమ్మే స్థితిలో లేదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. గత పదేళ్లలో రైతు సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చిన వారే ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం సిగ్గుచేటన్నారు.
IPL 2025 Final: కొత్త ఛాంపియన్ ఎవరు..? ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్స్.. ఫొటోస్ వైరల్
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!