Mulugu: గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి.. స్పందించిన మంత్రి
- ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో దారుణం.
- గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు మృతి.
- తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని మనస్తాపం
- గ్రామ సభలోనే పురుగుల మందు తాగిన రైతు.
- రైతు మృతిపై స్పందించిన మంత్రి సీతక్క.
Mulugu: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు గ్రామ సభలో జరిగిన వాదనలపై మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామసభలో రకరకాల అంశాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో, తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని భావించిన నాగేశ్వరరావు మనస్తాపంతో గ్రామ సభలోనే పురుగుల మందు తాగారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను హన్మకొండలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు.
Also Read: Gannavaram Airport: గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు.. గన్నవరం నుంచి హైదరాబాద్ కి తిరుగు పయనం
Also Read
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
ఓ వారం పాటు చికిత్స పొందిన అనంతరం నాగేశ్వరరావు పరిస్థితి మరింత విషమించి, చివరకు మృతి చెందారు. మృతుడికి భార్య శాంతి, కుమార్తెలు పూజ, ప్రణతి, కుమారుడు కార్తీక్ లు ఉన్నారు. ఈ దారుణ సంఘటనపై మంత్రి వర్యులు సీతక్క విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన నాగేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావు పరిస్థితి విషమించడంతో ఎంజియం (ఎయిర్ ఎంబులెన్స్) అవసరం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించానని మంత్రి అన్నారు.
Also Read: Tamil Nadu: దారుణం.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం, నాగేశ్వరరావు కుటుంబంతో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!