Mulugu: గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి.. స్పందించిన మంత్రి
- ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో దారుణం.
- గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు మృతి.
- తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని మనస్తాపం
- గ్రామ సభలోనే పురుగుల మందు తాగిన రైతు.
- రైతు మృతిపై స్పందించిన మంత్రి సీతక్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mulugu: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు గ్రామ సభలో జరిగిన వాదనలపై మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామసభలో రకరకాల అంశాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో, తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని భావించిన నాగేశ్వరరావు మనస్తాపంతో గ్రామ సభలోనే పురుగుల మందు తాగారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను హన్మకొండలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు.
Also Read: Gannavaram Airport: గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు.. గన్నవరం నుంచి హైదరాబాద్ కి తిరుగు పయనం
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
ఓ వారం పాటు చికిత్స పొందిన అనంతరం నాగేశ్వరరావు పరిస్థితి మరింత విషమించి, చివరకు మృతి చెందారు. మృతుడికి భార్య శాంతి, కుమార్తెలు పూజ, ప్రణతి, కుమారుడు కార్తీక్ లు ఉన్నారు. ఈ దారుణ సంఘటనపై మంత్రి వర్యులు సీతక్క విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన నాగేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావు పరిస్థితి విషమించడంతో ఎంజియం (ఎయిర్ ఎంబులెన్స్) అవసరం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించానని మంత్రి అన్నారు.
Also Read: Tamil Nadu: దారుణం.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం, నాగేశ్వరరావు కుటుంబంతో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!