Minister Ramprasad Reddy: మంత్రి రాసలీలల ఆరోపణలు హాస్యాస్పదం.. వైసీపీపై మండిపల్లి ఫైర్!
- మంత్రి రాసలీలలు అంటూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదం..
- వైసీపీకి కూటమి ప్రభుత్వంలో సమస్యలు దొరక్కపోవడంతో అసత్య ప్రచారాలు..
- అవినితికి పాల్పడిన పెద్దిరెడ్డిని వదిలే సమస్య లేదు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: ఎన్టీవీతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రాసలీలల ఆరోపణలు చేస్తూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై దాడి చేయడానికి సమస్యలు ఏవీ దొరకక, ప్రతి రోజూ వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. పాలనాపరమైన సమస్యలు ఉంటే వాటిపై మాట్లాడాలి.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి మండిపల్లి సూచించారు.
Read Also: Nikki Haley: రష్యా చమురు దిగుమతులపై జాగ్రత్తగా ఉండండి.. భారత్పై కీలక వ్యాఖ్యలు!
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
వారికి శిక్ష తప్పదు..
ఇక, భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడూ తిరుమలలోనే రాజకీయాలు చేస్తుంటారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన హయాంలో లడ్డూలో కల్తీ నెయ్యి స్కామ్ జరిగిందని అందరికీ తెలిసిందే.. కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలు ఒకటి రెండు కాదు, త్వరలో అన్ని బయటకు వస్తాయని స్పష్టం చేశారు. అలాగే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అన్ని అక్రమాలపై జరుగుతున్న విచారణ చివరి దశకు చేరుకుంది.. అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సరైన సమయంలో పెద్దిరెడ్డితో పాటు ఇతర నేతలపై కూడా చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Shilpa Shetty : ఈ అలవాట్ల వల్లే.. యాభైల్లోనూ ఇంత ఫిట్గా ఉన్న..
టీడీపీ క్రమశిక్షణా కమిటీ చర్యలు..
అయితే, టీడీపీ పార్టీ అనేది కోటి ఇరవై లక్షల మంది కార్యకర్తలతో ఉన్నదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గుర్తు చేశారు. ఎవరో ఒకరు పార్టీ లైన్ దాటి మాట్లాడినంత మాత్రాన పెద్ద సమస్యేమీ కాదన్నారు. పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా తగిన కమిటీ చర్యలు తీసుకుంటుంది.. వారిని పిలిచి వివరణ తీసుకుంటుందన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తోంది.. దీంతో వైసీపీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.. అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
The Odyssey: రిలీజ్కు ముందే సెన్సేషన్.. హాట్కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
-
Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!