Minister Ramprasad Reddy: మంత్రి రాసలీలల ఆరోపణలు హాస్యాస్పదం.. వైసీపీపై మండిపల్లి ఫైర్!
- మంత్రి రాసలీలలు అంటూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదం..
- వైసీపీకి కూటమి ప్రభుత్వంలో సమస్యలు దొరక్కపోవడంతో అసత్య ప్రచారాలు..
- అవినితికి పాల్పడిన పెద్దిరెడ్డిని వదిలే సమస్య లేదు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: ఎన్టీవీతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రాసలీలల ఆరోపణలు చేస్తూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై దాడి చేయడానికి సమస్యలు ఏవీ దొరకక, ప్రతి రోజూ వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. పాలనాపరమైన సమస్యలు ఉంటే వాటిపై మాట్లాడాలి.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి మండిపల్లి సూచించారు.
Read Also: Nikki Haley: రష్యా చమురు దిగుమతులపై జాగ్రత్తగా ఉండండి.. భారత్పై కీలక వ్యాఖ్యలు!
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
వారికి శిక్ష తప్పదు..
ఇక, భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడూ తిరుమలలోనే రాజకీయాలు చేస్తుంటారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన హయాంలో లడ్డూలో కల్తీ నెయ్యి స్కామ్ జరిగిందని అందరికీ తెలిసిందే.. కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలు ఒకటి రెండు కాదు, త్వరలో అన్ని బయటకు వస్తాయని స్పష్టం చేశారు. అలాగే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అన్ని అక్రమాలపై జరుగుతున్న విచారణ చివరి దశకు చేరుకుంది.. అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సరైన సమయంలో పెద్దిరెడ్డితో పాటు ఇతర నేతలపై కూడా చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Shilpa Shetty : ఈ అలవాట్ల వల్లే.. యాభైల్లోనూ ఇంత ఫిట్గా ఉన్న..
టీడీపీ క్రమశిక్షణా కమిటీ చర్యలు..
అయితే, టీడీపీ పార్టీ అనేది కోటి ఇరవై లక్షల మంది కార్యకర్తలతో ఉన్నదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గుర్తు చేశారు. ఎవరో ఒకరు పార్టీ లైన్ దాటి మాట్లాడినంత మాత్రాన పెద్ద సమస్యేమీ కాదన్నారు. పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా తగిన కమిటీ చర్యలు తీసుకుంటుంది.. వారిని పిలిచి వివరణ తీసుకుంటుందన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తోంది.. దీంతో వైసీపీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.. అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!