Minister Ramprasad Reddy: మంత్రి రాసలీలల ఆరోపణలు హాస్యాస్పదం.. వైసీపీపై మండిపల్లి ఫైర్!
- మంత్రి రాసలీలలు అంటూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదం..
- వైసీపీకి కూటమి ప్రభుత్వంలో సమస్యలు దొరక్కపోవడంతో అసత్య ప్రచారాలు..
- అవినితికి పాల్పడిన పెద్దిరెడ్డిని వదిలే సమస్య లేదు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: ఎన్టీవీతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రాసలీలల ఆరోపణలు చేస్తూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై దాడి చేయడానికి సమస్యలు ఏవీ దొరకక, ప్రతి రోజూ వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. పాలనాపరమైన సమస్యలు ఉంటే వాటిపై మాట్లాడాలి.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి మండిపల్లి సూచించారు.
Read Also: Nikki Haley: రష్యా చమురు దిగుమతులపై జాగ్రత్తగా ఉండండి.. భారత్పై కీలక వ్యాఖ్యలు!
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
వారికి శిక్ష తప్పదు..
ఇక, భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడూ తిరుమలలోనే రాజకీయాలు చేస్తుంటారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన హయాంలో లడ్డూలో కల్తీ నెయ్యి స్కామ్ జరిగిందని అందరికీ తెలిసిందే.. కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలు ఒకటి రెండు కాదు, త్వరలో అన్ని బయటకు వస్తాయని స్పష్టం చేశారు. అలాగే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అన్ని అక్రమాలపై జరుగుతున్న విచారణ చివరి దశకు చేరుకుంది.. అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సరైన సమయంలో పెద్దిరెడ్డితో పాటు ఇతర నేతలపై కూడా చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Shilpa Shetty : ఈ అలవాట్ల వల్లే.. యాభైల్లోనూ ఇంత ఫిట్గా ఉన్న..
టీడీపీ క్రమశిక్షణా కమిటీ చర్యలు..
అయితే, టీడీపీ పార్టీ అనేది కోటి ఇరవై లక్షల మంది కార్యకర్తలతో ఉన్నదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గుర్తు చేశారు. ఎవరో ఒకరు పార్టీ లైన్ దాటి మాట్లాడినంత మాత్రాన పెద్ద సమస్యేమీ కాదన్నారు. పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా తగిన కమిటీ చర్యలు తీసుకుంటుంది.. వారిని పిలిచి వివరణ తీసుకుంటుందన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తోంది.. దీంతో వైసీపీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.. అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!