Rajahmundry Central Prison: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్.. ఈ సారి ఆ ముగ్గురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajahmundry Central Prison: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ఈ సారి నందమూరి రామకృష్ణ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ములాఖత్లో చంద్రబాబును కలిశారు.. ఇవాళ ఉదయం 11 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకున్న కుటుంబ సభ్యులు.. చంద్రబాబుతో 40 నిముషాల పాటు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాజా పరిస్థితులపై కుటుంబ సభ్యులు ఆయనకు వివరించినట్టుగా తెలుస్తోంది.. చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా టీడీపీ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా అన్ని న్యాయస్థానాల్లో వివిధ పిటిషన్లపై విచారణలు సాగుతోన్న విషయం విదితమే.
Read Also: Bhagavanth Kesari: భగవంత్ బాదుడు… హాప్ సెంచరీ కొట్టేశాడు!
Also Read
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
కాగా, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన అరెస్ట్ చేశారు సీఐడీ అధికారులు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ 43వ రోజుకు చేరింది.. ఇక, నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం విదితమే. మరోవైపు, చంద్రబాబు లీగల్ ములాఖత్ల వ్యవహారం కూడా కోర్టు వరకు వెళ్లిన విషయం విదితమే.. చంద్రబాబు భద్రత దృష్ట్యా రోజుకు ఒక ములాఖత్ మాత్రమే ఉంటుందని రాజమండ్రి జైలు అధికారులు స్పష్టం చేయగా.. దీనిపై ఏసీబీ కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు న్యాయవాదులు.. రోజుకు కనీసం రెండుసార్లు ములాఖత్ లకు అవకాశం ఇవ్వాలని.. ఒక్కో ములాఖత్ 40-50 నిమిషాల వ్యవధి ఉండాలని చంద్రబాబు కోర్టును విన్నవించారు. పలు కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో లాయర్లతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం అవసరం అవుతుందని.. అందుకే ములాఖత్ ల సంఖ్యను పెంచాలని అభ్యర్థించారు. కేసును విచారించిన ఏసీబీ న్యాయస్థానం.. రోజుకు రెండుసార్లు ములాఖత్ అయ్యేందుకు వీలుగా అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!