Fake Seeds: నకిలీ విత్తనాల పంజా.. అన్నదాతల విలవిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశలేదు. కొందరు కేటుగాళ్ళ కారణంగా అన్నదాతలకు అగచాట్లు తప్పడంలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాలపై నకిలీ విత్తనాలు పంజా విసురుతున్నాయి. అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టేశారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచివస్తున్నాయో తెలీడం లేదు.
ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల తనిఖీలలో కొన్నే బయటపడుతున్నాయి. రైతులకు చేరాల్సినవి చేరిపోతున్నాయి.
Also Read
- Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
- Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ఆదిలాబాద్ ఉమ్మడిజిల్లాలో కొన్నిప్రాంతాలపై నకిలీ విత్తనాలు దాడి చేస్తున్నాయి. మారుమూల గ్రామాలను అక్కడి రైతులను మచ్చిక చేసుకుని నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. మంచిర్యాలజిల్లాలో ఒక్కరోజు తనిఖీలు చేపడితే ఒక క్వింటాల్ 18 కిలోల నకిలీవిత్తనాలు దొరికాయంటే ఏమేరకు నకిలీ రాయుళ్ళు వేళ్లూనుకుపోతున్నారో అర్థం అవుతుంది.
మంచిర్యాలజిల్లా తాండూరు .భీమిని ,నెన్నెల, కన్నెపల్లి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు నిల్వచేశారు. తాండూర్ మండలంలో ఓవ్యాపారి ఏటా కోట్ల వ్యాపారం చేస్తున్నారనే విషయం ప్రచారంలో వుంది. గతంలో రెండుమూడుసార్లు పట్టుబడ్డా ఇప్పటికీ ఆ వ్యాపారం వదల్లేదు. తాండూరు ,రెబ్బన,తిర్యాణి మండలాలకు సైతం ఇక్కడినుంచే విత్తనాల సరఫరా జరుగుతుంది. వీరికి కొందరు పోలీసులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసి నకిలీ విత్తనాలు అరికట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ మూడుమండలాల్లో 118 కిలోల నకిలీ పత్తివిత్తనాలు సీజ్ చేశారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలుర రైసుమిల్లులలో నిల్వ ఉంచారని సమాచారం అందగా అక్కడికి వెళ్ళేలోపే విత్తనాలు మాయం చేశారట. అయితే ఎవరో సమాచారం అందించారని ప్రత్యేక టీంలు భావించాయి. అక్కడ ఏటా ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చి హెచ్ జీ కాటన్ సీడ్స్ సేల్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు నిల్వలు ఏర్పాటుచేయటంతో పాటు పలు గ్రామాల్లో రైతులకు అంటగట్టినట్టు తెలిసింది.తాజాగా నెన్నెల , తాండూర్, భీమిని పరిధిలోనే 118 కిలోల నకిలీ విత్తనాలు దొరికాయని, వీటిపై విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
వ్యవసాయశాఖ నిఘా లేకపోవడంతో అక్రమార్కులు విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది రెండు పీడీయాక్ట్ లు, 20 కేసులు నమోదుచేశామని అధికారులు చెబుతున్నారు. మళ్ళీ నకిలీ విత్తనాలు నిల్వచేయడంతో కలకలం రేగుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఏదో చేస్తాం అని చెప్పినా నకిలీ రాయుళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. గతంలో కేసుల్లో వున్నవారు అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అధికారులు పకడ్బందీ చర్యలు చేపటకపోతే రైతులు భారీగా నష్టపోకతప్పదంటున్నారు.
Read Also: Power Cut Effect: అనంతపురంలో పరిశ్రమలకు విద్యుత్ షాక్
తాజావార్తలు
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!