EC Alert: ఎన్నికల షెడ్యూల్పై ఈసీ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ (Lok Sabha Elections) రకరకాలైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది.
త్వరలో దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇదే అదునుగా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోన్న ప్రకటన నకిలీదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపింది. ఈ ఫేక్ మెసేజ్ను వేరొకరికి పంపే ముందు ధ్రువీకరించుకోవాలని సూచిస్తూ #VerifyBeforeYouAmplify హ్యాష్ట్యాగ్తో ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది.
మార్చి 12 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం పేరిట ఓ నకిలీ లేఖను కొందరు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 19న పోలింగ్, మే 22న ఓట్ల లెక్కింపు, మే 30 నాటికి ప్రభుత్వ ఏర్పాటు అంటూ పేర్కొనబడింది.
వాస్తవానికి అసెంబ్లీ/లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తుంటారు. ఎన్నికల తేదీలు, ఓట్ల లెక్కింపు, ఏయే రాష్ట్రాల్లో ఏ తేదీన ఎన్నికలు జరుగుతాయి? ఎన్ని విడతల్లో పోలింగ్ ఉంటుంది? నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? మొత్తం ఓటర్లు ఎంతమంది? పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది.. ఇలా అన్ని వివరాలనూ మీడియాకు తెలియజేస్తుంటారు కానీ అంతకంటే ముందే సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఈ వార్తలు నమ్మొద్దని ఈసీ కోరింది.
ఇదిలా ఉంటే ఏప్రిల్- మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎన్నికల సమరానికి అస్త్రాలను సిద్ధం చేసుకొంటున్న రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా.. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. 195మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేయగా.. కాంగ్రెస్ 36 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. రాహుల్ గాంధీ తిరిగి వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు. తెలంగాణ నుంచి నలుగురి పేర్లను వెల్లడించింది.
A fake message is being shared on Whats app regarding schedule for #LokSabhaElections2024#FactCheck: The message is #Fake. No dates have been announced so far by #ECI.
Election Schedule is announced by the Commission through a press conference. #VerifyBeforeYouAmplify pic.twitter.com/DAZlNFOF5W
— Election Commission of India (@ECISVEEP) March 8, 2024
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!