Fake Liquor Factory: కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్తో ఇంట్లోనే మద్యం తయారీ.. చివరికీ..
- కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్తో ఇంట్లోనే మద్యం తయారీ
- చిన్న బిల్డింగ్ అద్దెకు తీసుకుని సొంతంగా డిస్టిల్లరీ ఓపెన్
- మద్యం తయారీ దందా స్టార్ట్ చేసిన తిరుమనాథం దుర్గారావు
- హైదరాబాద్ నుంచి స్పిరిట్, కేరమిల్ తెప్పించి మద్యం తయారీ
- కేసులో మొత్తం 8 మంది నిందితుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటీర పరిశ్రమలా మద్యం తయారీ. యస్.. మీరు విన్నది కరెక్టే. కోనసీమ జిల్లాలో ఇలాగే కొంత మంది ఇంట్లోనే మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి అన్బ్రాండెడ్ లిక్కర్ తయారు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు. కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే మద్యం తయారు చేయవచ్చు. ఈ విషయంపై పరిశోధన చేసిన కొంత మంది గ్యాంగ్.. కుటీర పరిశ్రమ కూడా పెట్టుకున్నారు. ఏకంగా ఓ చిన్న బిల్డింగ్ అద్దెకు తీసుకుని సొంతంగా డిస్టిల్లరీ ఓపెన్ చేశారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పోలీసుల చెవిన పడింది. ఇంకేముంది పోలీసులు రైడ్ చేశారు.
READ MORE: Hyderabad: ఓయో రూంలో యువతి మృతదేహం.. ఇది హత్యా.. ఆత్మహత్యా..?
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఇక్కడ చూడండి.. ఈ మెటీరియల్ అంతా పోలీసులు రైడ్ చేసి తీసుకు వచ్చిన నకిలీ మద్యం తయారీ ముఠాకు సంబంధించినదే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్నంలో తిరుమనాథం దుర్గారావు.. ఓ ఇంటిలో నకిలీ మద్యం తయారీ కేంద్రం స్టార్ట్ చేశాడు. ఇతని ఆధ్వర్యంలోని ముఠా హైద్రాబాద్ నుంచి స్పిరిట్, కేరమిల్ కలర్ ఏజెంట్ను కొరియర్ ద్వారా తెప్పించింది.. ఇంకేముంది హైదరాబాద్ నుంచి మెటీరియల్ రాగానే.. ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించారు. 180ML బాటిల్స్లో నకిలీ మద్యం నింపి అమ్ముతున్నారు. నిజానికి ప్రభుత్వం నుంచి 180 ఎంఎల్ బాటిల్ రూ. 160కి విక్రయిస్తుండగా.. అదే పేరుతో చేసిన నకిలీ బ్రాండ్ను వీళ్లు రూ. 80 నుంచి రూ. 120 వరకు అమ్ముతున్నారు. దీని రేటు తక్కువగా ఉండడంతో జనం ఇదే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
READ MORE: Real Estate Scam: సొంతిటి కలలు కనే వారే టార్గెట్.. రియల్ ఎస్టేట్లో కొత్త తరహా మోసాలు..
కొమరిగిరిపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పోలీసులు సోదాలు చేశారు. అప్పుడు 1065 లీటర్ల స్పిరిట్, 6 వేల ఖాళీ సీసాలను, 6 వేల ఫేక్ లేబుల్స్, 6 వేల మూతలు స్వాధీనం చేసుకున్నారు. అంతే నకిలీ మద్యం తయారీకి ఉపయోగించిన మిషన్ను, ఒక ఆటోను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇక్కడ పట్టుకున్న నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాలకొల్లులోని ఒక గోడౌన్లో ఉన్న 130 లీటర్ల స్పిరిట్ , కేరమిల్ , మిషన్ , మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు . పాలకొల్లులో వడ్డీ వ్యాపారి పులి రోషన్ శీతల్ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కేసుల్లో ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!