Sanjay Raut: యోగి ఆదిత్యనాథ్పై ఒత్తిడి తెచ్చేందుకు ఫడ్నవీస్ రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీకి సీట్లు తగ్గడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. నిన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన రాష్ట్రంలో బీజేపీ పని తీరుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆయన తీరుపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఇది యోగి ఆదిత్యనాథ్పై ఒత్తిడి తెచ్చేందుకు ఓ ఎత్తుగడ అని అన్నారు. కొత్త ఎన్డీయే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు.
Read Also: Justin Trudeau: కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు..
Also Read
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనివ్వండి.. స్వీట్లు పంచి పెట్టమని మేము సూచిస్తాం.. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని సంజయ్ రౌత్ అన్నారు. ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లకు అనుకూలంగా ఉందన్నారు. ఈసారి మహారాష్ట్రలో బీజేపీకి తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి.. దాని మిత్రపక్షం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఏడు స్థానాల్లో గెలుపొందగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది అని శివసేన (యూబీటీ) సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
Read Also: loksabha election results: బీజేపీ గెలుపు పై అంతర్జాతీయ మీడియా ఫోకస్..
ఇక, ఉత్తరప్రదేశ్లో బీజేపీకి బిగ్ షా తగిలింది.. దీంతో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.. 2014, 2019లో యూపీ బలంతో బీజేపీ మెజారిటీ స్థానాలను సాధించింది. ఈసారి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కేవలం 33 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2019లో ఈ సంఖ్య 63గా ఉండేది. యూపీ ఫలితాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు పెద్ద దెబ్బగా మారింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో బీజేపీ అద్భుత ప్రదర్శన చేసింది. కానీ, యోగి ఆదిత్యనాథ్ ప్రభావం ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ నష్టాలను చవిచూసింది. ఇటీవలే రామమందిరం ఏర్పాటు చేసిన ఫైజాబాద్ స్థానాన్ని కూడా ఆ పార్టీ కోల్పోయింది.
#WATCH | Shiv Sena (UBT) leader Sanjay Raut says, " I am saying this again and again, Modiji's govt won't be formed and if his govt is formed, it won't last" pic.twitter.com/J9qrH00HKs
— ANI (@ANI) June 6, 2024
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!