Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాలయ దేశం నేపాల్ చిరుగుటాకులా వణుకుతోంది. ఆకస్మిక వరద రూపంలో విరుచుకుపడ్డ హిమానీ నదం ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టింది. ఇప్పటికే వందల సంఖ్యలో మృతులున్నట్టు లెక్క తేలుతున్నా.. గల్లంతైన వారీ సంఖ్య భారీగా ఉండటంతో.. ప్రాణనష్టం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. నేపాల్ పెను విషాదంతో.. పర్యావరణ సమతౌల్యంపై మరోసారి చర్చ తెరైపకి వచ్చింది. ప్రకృతికి ఎదురీదితే ఎప్పటికైనా ముప్పు తప్పదనే హెచ్చరికలు వస్తున్నాయి. ప్రస్తుత విషాదం నేపాల్ కే కాకుండా.. టిబెట్, చైనా, భారత్కూ ప్రమాద సంకేతమేననే అభిప్రాయాలున్నాయి.
హిమాలయ దేశం నేపాల్లో సంభవించిన మెరుపు వరదలు వందల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. భోటే కోషి నది ఉప్పొంగడంతో అనేక జిల్లాలను వరద, బురద కలిసి ముంచెత్తింది. ఈ జలప్రళయానికి మంచుకొండల్లో భూకంపమే కారణమని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, హిమానీ నదం బద్దలవడం వల్లే ఈ విపత్తు సంభవించినట్టు.. అమెరికా జియాలాజికల్ సర్వే తాజాగా వెల్లడించింది. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ఆకస్మిక వరదలు 4.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కాదని, హిమానీ నదం కూలిపోవడం వలన సంభవించాయని అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. తొలుత ఈ ఘటనను 4.4 తీవ్రత గల భూకంపంగా నివేదించినప్పటికీ, విశ్లేషణ అనంతరం భూకంపం సంభవించలేదని నిర్ధారించినట్లు తెలిపింది. సమీపంలోని భూకంప కేంద్రాల సమాచారం, దీర్ఘకాలిక భూకంప తరంగాలు, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. హిమానీ నదం కూలిపోవడం, అనంతరం భారీగా శిథిలాలు దిగువ ప్రాంతాలకు ప్రవహించడం వల్లే ప్రకంపనలు నమోదైనట్లు వివరించింది. బుధవారం టిబెట్లో ప్రారంభమైన ఈ ఆకస్మిక వరదలు నేపాల్లోని రసువా, ధాడింగ్ జిల్లాల్లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. శిథిలాల ప్రవాహం దిగువ ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి కారణమైనట్లు తేలింది.
Also Read
- Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
- Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
- Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
- Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
భోటెకోషి నది ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు సంభవించాయి. నేపాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా నదుల్లో నీటిమట్టాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలపై వరద ప్రభావం ఉండే అవకాశాన్ని కేంద్ర హోంశాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకునేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో గల్లంతైన వారి పూర్తి వివరాలు సేకరించడం కష్టంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్ భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే రహదారులు, వంతెనలు దెబ్బతినడం, కొన్ని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు పనిచేయకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. భారీ వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేసింది. మరోవైపు భారత్ కూడా తన పౌరుల వివరాలను సేకరించి, వారిని సురక్షితంగా తరలించేందుకు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తోంది.
నేపాల్-టిబెట్ సరిహద్దు వెంబడి సంభవించిన వరదలు హిమాలయ ప్రాంతం మొత్తాన్ని మరోసారి భయభ్రాంతులకు గురిచేశాయి. మంచు, రాళ్లు, శిథిలాలతో కూడిన భారీ ప్రవాహం నిమిషాల వ్యవధిలోనే నదీ లోయల గుండా దూసుకువచ్చి, ఇళ్లను, రోడ్లను, వంతెనలను ముంచెత్తింది. ఇది ఒక్క రోజుతో ముగిసిపోయే విపత్తు కాదు. ఇప్పుడు అసలైన ఆందోళన నదులు, వాగులలో పేరుకుపోయే చెత్తాచెదారం గురించే. భారీ వర్షాల వల్ల ఈ అడ్డంకి ఏర్పడి తాత్కాలికంగా ఒక సరస్సు ఏర్పడవచ్చు. అకస్మాత్తుగా గండి పడితే నది మళ్లీ ఉధృతంగా ప్రవహించవచ్చు. ప్రస్తుతానికి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తోంది.
ఆగష్టు 26న నేపాల్ , టిబెట్ సరిహద్దులోని రసువా ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక లోయలోకి మంచు, రాళ్లతో కూడిన ఒక పెద్ద ముక్క విరిగిపడింది. దీనివల్ల నీరు, మంచు, బురద, పెద్ద బండరాళ్లతో కూడిన ఒక ఉధృత ప్రవాహం ఏర్పడిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వరద భోటే కోషి త్రిశూలి నదుల వైపు కదిలింది. నిపుణులు ఈ వరదను సాధారణ వర్షపాతానికి భిన్నమైనదిగా పరిగణిస్తున్నారు. హిమానీనదాలు విరిగిపోవడం, కొండచరియలు విరిగిపడటం, నదులు తాత్కాలికంగా మూసుకుపోవడం వంటి కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అరగంటలోనే నదీమట్టాలు తొమ్మిది మీటర్ల మేర పెరిగాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేగంగా కరుగుతున్న మంచు కారణంగా ఎత్తైన హిమాలయ లోయలు గతంలో కంటే మరింత అస్థిరంగా మారాయి. ఈ విపత్తులో ఇదే అత్యంత భయానకమైన అంశం. నీరు, శిథిలాలు తమకు చాలా దగ్గరగా వచ్చిన తర్వాతే, కింద నివసించే ప్రజలకు కొండ శిఖరంపై ఏం జరుగుతుందో తరచుగా తెలుస్తుంది.
ప్రస్తుతం అతిపెద్ద ఆందోళన ఏంటంట.. మరో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నదిలో పేరుకుపోయే శిథిలాలు, కొండచరియలు విరిగిపడిన తర్వాత రాళ్లు, బురద తరచుగా నది మార్గాన్ని అడ్డుకుంటాయి, దీనివల్ల నీరు నిలిచిపోతుంది. ఈ సహజ ఆనకట్ట బలహీనపడితే, చెప్పుకోదగ్గ వర్షపాతం లేకపోయినా ఆకస్మిక వరదలు సంభవించవచ్చు.
నైరుతి రుతుపవన కాలం సెప్టెంబరులోనే ముగిసిపోదు. భారతదేశానికి దాని వార్షిక వర్షపాతంలో సుమారు 80 శాతం జూన్, సెప్టెంబరు మధ్య లభిస్తుంది. పర్వత ప్రాంతాలలో, వాలు ప్రాంతాలు అప్పటికే తడిగా , బలహీనంగా ఉండటం వల్ల, ఒక్క రోజు కురిసే అత్యంత భారీ వర్షం కూడా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. భారత వాతావరణ శాఖ ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెలువరించిన విస్తృత వాతావరణ సూచన ప్రకారం, పశ్చిమ హిమాలయాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ , ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పలు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో హిమాలయ ప్రాంతం పూర్తిగా సురక్షితం కాదని ఐఎండి రుతుపవనాల అప్డేట్ సూచిస్తోంది. ప్రతి నదికి తప్పకుండా వరద వస్తుందని దీని అర్థం కాదు. నది ఇరుకైన లోయ గుండా ప్రవహించే చోట, పర్వతం ఇప్పటికే పగిలిపోయిన చోట, లేదా శిథిలాలు నీటి మార్గాన్ని అడ్డుకుంటున్న చోట ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నేపాల్లోని అనేక నదులు బీహార్, ఉత్తరప్రదేశ్ మైదానాల్లోకి ప్రవేశిస్తాయి. ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగితే, దాని ప్రభావం సరిహద్దుకు ఇటువైపు కూడా కనిపించవచ్చు.
ఆగస్టు 26న లెంధే నదిలో భారీగా మంచు, రాళ్లు, బురద కూలిపోవడంతో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం 9 మీటర్ల వరకు పెరిగింది. ఈ వరద ప్రవాహం భోటే కోషి, త్రిశూలి నదుల ద్వారా దిగువ ప్రాంతాలకు వేగంగా చేరింది. దీంతో రసువా, నువాకోట్ జిల్లాల్లోని స్యాప్రు బేసి, బేత్రావతి వంటి పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యల సందర్భంగా తీసిన ఏరియల్ వీడియోలలో గ్రామాలు, మార్కెట్లు పూర్తిగా బురద దిబ్బలుగా మారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, వంతెనలు, రోడ్లు, జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నేపాల్ విషాదంలో చనిపోయిన, గల్లంతైన వారి సంగతి పక్కనపెడితే.. ప్రత్యక్షంగా ప్రకృతి ప్రకోపాన్ని చూసిన వారు ఇప్పటికీ తీవ్రంగా భయపడిపోతున్నారు. అసలు ఎలాంటి హెచ్చరిక, ముందస్తు సంకేతం లేకుండా.. హఠాత్తుగా జలప్రవాహం విరుచుకుపడటం.. అది ప్రళయకాలాన్ని తలపించడం.. చాలా మందికి జీవితంలో మర్చిపోలేని చేదుజ్ఞాపకం అంటే అతిశయోక్తి కాదు. పేకమేడల్లా కూలిన వంతెనలు, కొట్టుకుపోయిన నాలుగంతస్తుల భవనాల్ని కూడా ప్రత్యక్షంగా చూసిన అనుభవాల్ని మర్చిపోవడం అంత తేలిక కాదు. ఇదిలా ఉండగా.. విపత్తు ఇంకా ముగిసిపోలేదన్న నిపుణుల మాటలు వారిని ఇంకా భయపెడుతున్నాయి. ఇదే సమయంలో రవాణా పునరుద్ధరణ అంత తేలిక కాదనే అంచనాలు.. అక్కడ చిక్కుకున్నవారిలో భయం పెంచుతున్నాయి. ప్రస్తుతానికి ఈ పెను విపత్తు నుంచి అందర్నీ సురక్షితంగా తప్పించడంతో పాటు.. భవిష్యత్తులో మెరుపు వరదలు రాకుండా ఏం చేయాలో.. వస్తే ఎలా కాచుకోవాలో కచ్చితంగా అధ్యయనం చేయాలి. గల్లంతైన వారిలో 100 నుంచి 140 మందికి పైగా భారతీయ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేషియాకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ సైన్యం హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టి, భవనాలపై, శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. సరిహద్దుకు ఇరువైపులా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావం కారణంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని నదీ పరివాహక ప్రాంతాల్లోనూ అధికారులు అప్రమత్తత ప్రకటించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?