Justin Trudeau: కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Relations: ఖలిస్తాన్ సమస్యపై గతేడాది నుంచి భారత్- కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక, కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో ఈ సంబంధాలలో మరింత ఉద్రిక్తతను సృష్టించాయి. కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు అని ఈ నివేదికలో వెల్లడించింది. విదేశీ జోక్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ నివేదికలో మొదటి ముప్పు చైనాగా ఆ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్యానెల్లో కెనడాలోని అన్ని పార్టీల ఎంపీలు, భద్రతా అధికారులు కూడా ఉన్నారు.
Read Also: loksabha election results: బీజేపీ గెలుపు పై అంతర్జాతీయ మీడియా ఫోకస్..
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
కాగా, ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో కెనడా- భారతదేశం మధ్య సంబంధాలు గత ఏడాది క్షీణించాయి. తమపై నిరాధారమైన ఆరోపణ చేయడం మంచిది కాదని ఇండియా ఆ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇప్పటి వరకు కెనడా ఈ విషయంలో ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు.. అయితే, ఇటీవల కెనడాలో ఈ కేసులో పంజాబీ మూలాలున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో భారత్ను రెండో ముప్పుగా అభివర్ణించిన కెనడా ప్యానెల్ నివేదిక మే నెలలోనే బయటకు వచ్చింది. అయితే ఈ వారం దానిని పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు.
Read Also: Train Accident: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో గూడ్స్ రైలును రైలు ఢీ.. నలుగురు మృతి
ఈ నివేదికలో దేశీయంగా, విదేశాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు కెనడా ప్రజాస్వామ్యంలో చైనా జోక్యం చేసుకుంటోంది అని పేర్కొనింది. మరోవైపు, కెనడా ప్రజాస్వామ్యం, సంస్థలలో జోక్యం చేసుకోవడానికి భారతదేశం వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్యానెల్ తయారు చేసిన నివేదికలో 44 సార్లు ఇండియా పేరును ప్రస్తావించింది. అది రెండో అతిపెద్ద ముప్పుగా అభివర్ణించింది. భారత్ విదేశీ జోక్యం క్రమంగా పెరుగుతోందని కెనడియన్ ప్యానెల్ రూపొందించి నివేదికలో వెల్లడించింది. అయితే, ఈ కెనడా నివేదికపై భారతదేశం ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!