Justin Trudeau: కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Relations: ఖలిస్తాన్ సమస్యపై గతేడాది నుంచి భారత్- కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక, కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో ఈ సంబంధాలలో మరింత ఉద్రిక్తతను సృష్టించాయి. కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు అని ఈ నివేదికలో వెల్లడించింది. విదేశీ జోక్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ నివేదికలో మొదటి ముప్పు చైనాగా ఆ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్యానెల్లో కెనడాలోని అన్ని పార్టీల ఎంపీలు, భద్రతా అధికారులు కూడా ఉన్నారు.
Read Also: loksabha election results: బీజేపీ గెలుపు పై అంతర్జాతీయ మీడియా ఫోకస్..
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
కాగా, ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో కెనడా- భారతదేశం మధ్య సంబంధాలు గత ఏడాది క్షీణించాయి. తమపై నిరాధారమైన ఆరోపణ చేయడం మంచిది కాదని ఇండియా ఆ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇప్పటి వరకు కెనడా ఈ విషయంలో ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు.. అయితే, ఇటీవల కెనడాలో ఈ కేసులో పంజాబీ మూలాలున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో భారత్ను రెండో ముప్పుగా అభివర్ణించిన కెనడా ప్యానెల్ నివేదిక మే నెలలోనే బయటకు వచ్చింది. అయితే ఈ వారం దానిని పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు.
Read Also: Train Accident: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో గూడ్స్ రైలును రైలు ఢీ.. నలుగురు మృతి
ఈ నివేదికలో దేశీయంగా, విదేశాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు కెనడా ప్రజాస్వామ్యంలో చైనా జోక్యం చేసుకుంటోంది అని పేర్కొనింది. మరోవైపు, కెనడా ప్రజాస్వామ్యం, సంస్థలలో జోక్యం చేసుకోవడానికి భారతదేశం వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్యానెల్ తయారు చేసిన నివేదికలో 44 సార్లు ఇండియా పేరును ప్రస్తావించింది. అది రెండో అతిపెద్ద ముప్పుగా అభివర్ణించింది. భారత్ విదేశీ జోక్యం క్రమంగా పెరుగుతోందని కెనడియన్ ప్యానెల్ రూపొందించి నివేదికలో వెల్లడించింది. అయితే, ఈ కెనడా నివేదికపై భారతదేశం ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!