Justin Trudeau: కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Relations: ఖలిస్తాన్ సమస్యపై గతేడాది నుంచి భారత్- కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక, కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో ఈ సంబంధాలలో మరింత ఉద్రిక్తతను సృష్టించాయి. కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు అని ఈ నివేదికలో వెల్లడించింది. విదేశీ జోక్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ నివేదికలో మొదటి ముప్పు చైనాగా ఆ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్యానెల్లో కెనడాలోని అన్ని పార్టీల ఎంపీలు, భద్రతా అధికారులు కూడా ఉన్నారు.
Read Also: loksabha election results: బీజేపీ గెలుపు పై అంతర్జాతీయ మీడియా ఫోకస్..
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
కాగా, ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో కెనడా- భారతదేశం మధ్య సంబంధాలు గత ఏడాది క్షీణించాయి. తమపై నిరాధారమైన ఆరోపణ చేయడం మంచిది కాదని ఇండియా ఆ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇప్పటి వరకు కెనడా ఈ విషయంలో ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు.. అయితే, ఇటీవల కెనడాలో ఈ కేసులో పంజాబీ మూలాలున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో భారత్ను రెండో ముప్పుగా అభివర్ణించిన కెనడా ప్యానెల్ నివేదిక మే నెలలోనే బయటకు వచ్చింది. అయితే ఈ వారం దానిని పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు.
Read Also: Train Accident: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో గూడ్స్ రైలును రైలు ఢీ.. నలుగురు మృతి
ఈ నివేదికలో దేశీయంగా, విదేశాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు కెనడా ప్రజాస్వామ్యంలో చైనా జోక్యం చేసుకుంటోంది అని పేర్కొనింది. మరోవైపు, కెనడా ప్రజాస్వామ్యం, సంస్థలలో జోక్యం చేసుకోవడానికి భారతదేశం వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్యానెల్ తయారు చేసిన నివేదికలో 44 సార్లు ఇండియా పేరును ప్రస్తావించింది. అది రెండో అతిపెద్ద ముప్పుగా అభివర్ణించింది. భారత్ విదేశీ జోక్యం క్రమంగా పెరుగుతోందని కెనడియన్ ప్యానెల్ రూపొందించి నివేదికలో వెల్లడించింది. అయితే, ఈ కెనడా నివేదికపై భారతదేశం ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.
తాజావార్తలు
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!