Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore: చెట్ల మధ్యలో కుళ్లినస్థితిలో గుర్తు తెలియని మృతదేహం.. మూడు రోజుల క్రితం చంపేసి పడేశారు.. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.. మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.. దీంతో హత్యకు గల కారణాలు.. చంపిన వారి వివరాలు.. ఎందుకు చంపారనే విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో వారం క్రితం జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలోని వింజెటమ్మ కొండ సమీపంలో స్థానికులు ఓ డెడ్ బాడీ గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు.. అక్కడికి చేరుకున్నారు. ఓ యువకుడు మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు గుర్తించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతి చెందిన వ్యక్తిని కలిగిరి మండలంలోని వీర్నకొల్లు గ్రామానికి చెందిన మేదరమెట్ల శ్రీకాంత్గా గుర్తించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు మేదరమెట్ల శ్రీకాంత్ మృతికి ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆ మహిళ కోసం సెర్చ్ చేసే సమయంలో హత్య జరిగిన చోట టవర్ డంప్ చూడగా.. స్పాట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు బయటపడ్డాయి.
Also Read
- SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
- Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
వెంగమ్మకు.. మృతుడు శ్రీకాంత్కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. శ్రీకాంత్కి తెలియకుండా వెంగమ్మ మరో ఇద్దరితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తూ ఉండటంతో శ్రీకాంత్కి తెలిసి నిలదీశాడు. దీంతో అతన్ని ఎలాగైనా చంపేయాలని ఆమె డిసైడ్ అయింది. అతనికి మే 15న స్పాట్ పెట్టీ ఫోన్ చేశారు. కానీ శ్రీకాంత్ స్పందించలేదు.. దీంతో మరుసటి రోజు మరోసారి ఫోన్ చేయగా వింజమూరులోని వింజటమ్మ కొండ సమీపానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ముందస్తు ప్లాన్ ప్రకారం తనతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న హరిబాబు, ప్రదీప్ను పిలిపించి అతన్ని కత్తితో పొడిచి చంపించేసింది. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు.
ఎలాంటి క్లూ లేని ఈ కేసులో కలిగిరి పోలీసులు సాంకేతికతను ఉపయోగించి మృతుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అతని ఫోన్ డేటా సేకరించి మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా శ్రీకాంత్తో తనకు వివాహేతర సంబంధం ఉందని.. మరో ఇద్దరితో కూడా సంబంధం ఉండటంతో తనకు, శ్రీకాంత్ కి మనస్పర్ధలు వచ్చాయని విచారణలో నిందితురాలు చెప్పింది. అడ్డుగా ఉన్నాడని ఇద్దరు యువకులతో కలిసి చంపేసినట్లు నేరం ఒప్పుకుంది. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు పోలీసులు. మొత్తంగా ఈ కేసులో ముగ్గురు నిందితులు తప్పించుకోవాలని చూసినప్పటికీ.. పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు.
తాజావార్తలు
-
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
-
Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!
-
Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
-
Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?