Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore: చెట్ల మధ్యలో కుళ్లినస్థితిలో గుర్తు తెలియని మృతదేహం.. మూడు రోజుల క్రితం చంపేసి పడేశారు.. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.. మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.. దీంతో హత్యకు గల కారణాలు.. చంపిన వారి వివరాలు.. ఎందుకు చంపారనే విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో వారం క్రితం జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలోని వింజెటమ్మ కొండ సమీపంలో స్థానికులు ఓ డెడ్ బాడీ గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు.. అక్కడికి చేరుకున్నారు. ఓ యువకుడు మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు గుర్తించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతి చెందిన వ్యక్తిని కలిగిరి మండలంలోని వీర్నకొల్లు గ్రామానికి చెందిన మేదరమెట్ల శ్రీకాంత్గా గుర్తించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు మేదరమెట్ల శ్రీకాంత్ మృతికి ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆ మహిళ కోసం సెర్చ్ చేసే సమయంలో హత్య జరిగిన చోట టవర్ డంప్ చూడగా.. స్పాట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు బయటపడ్డాయి.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
వెంగమ్మకు.. మృతుడు శ్రీకాంత్కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. శ్రీకాంత్కి తెలియకుండా వెంగమ్మ మరో ఇద్దరితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తూ ఉండటంతో శ్రీకాంత్కి తెలిసి నిలదీశాడు. దీంతో అతన్ని ఎలాగైనా చంపేయాలని ఆమె డిసైడ్ అయింది. అతనికి మే 15న స్పాట్ పెట్టీ ఫోన్ చేశారు. కానీ శ్రీకాంత్ స్పందించలేదు.. దీంతో మరుసటి రోజు మరోసారి ఫోన్ చేయగా వింజమూరులోని వింజటమ్మ కొండ సమీపానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ముందస్తు ప్లాన్ ప్రకారం తనతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న హరిబాబు, ప్రదీప్ను పిలిపించి అతన్ని కత్తితో పొడిచి చంపించేసింది. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు.
ఎలాంటి క్లూ లేని ఈ కేసులో కలిగిరి పోలీసులు సాంకేతికతను ఉపయోగించి మృతుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అతని ఫోన్ డేటా సేకరించి మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా శ్రీకాంత్తో తనకు వివాహేతర సంబంధం ఉందని.. మరో ఇద్దరితో కూడా సంబంధం ఉండటంతో తనకు, శ్రీకాంత్ కి మనస్పర్ధలు వచ్చాయని విచారణలో నిందితురాలు చెప్పింది. అడ్డుగా ఉన్నాడని ఇద్దరు యువకులతో కలిసి చంపేసినట్లు నేరం ఒప్పుకుంది. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు పోలీసులు. మొత్తంగా ఈ కేసులో ముగ్గురు నిందితులు తప్పించుకోవాలని చూసినప్పటికీ.. పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!