Gudivada Amarnath: పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేము!
- పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం
- జగన్ మోహన్ రెడ్డి టార్చ్ బేరర్
- హోంమంత్రి రీల్స్ చూసుకొని కాలక్షేపం చేసేస్తే మంచిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారని విమర్శించారు. తనపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని, హోంమంత్రి రీల్స్ చూసుకుని కాలక్షేపం చేసేస్తే మంచిదని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
విశాఖలో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… ‘వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తాం. పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేము. గతంలో చంద్రబాబు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారు. జగన్ మోహన్ రెడ్డి టార్చ్ బేరర్. ఒక మనిషి లేకపోయినా రాజకీయం ఆగిపోదు. నాయకులను తయారు చేసుకునే శక్తి జగన్ రెడ్డికి ఉంది. బెదిరింపులు ద్వారా నాయకులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. కొంత మంది తట్టుకుంటారు, మరికొందరు తట్టుకోలేరు.. నాపైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది’ అని అన్నారు.
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
‘దావోస్ నుంవి ఉత్తిచేతులతో తిరిగి వచ్చి ఇప్పుడు మిథ్య అంటున్నారు. 10 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ దావోస్ మిథ్య అనేది అర్థం కాలేదా?. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రతిష్ట కంటే రెడ్ బుక్ గురించి విదేశాల్లో సైతం మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. నాపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదు. హోంమంత్రి రీల్స్ చూసుకొని కాలక్షేపం చేసేస్తే మంచిది’ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!