Gudivada Amarnath: పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేము!
- పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం
- జగన్ మోహన్ రెడ్డి టార్చ్ బేరర్
- హోంమంత్రి రీల్స్ చూసుకొని కాలక్షేపం చేసేస్తే మంచిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారని విమర్శించారు. తనపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని, హోంమంత్రి రీల్స్ చూసుకుని కాలక్షేపం చేసేస్తే మంచిదని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
విశాఖలో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… ‘వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తాం. పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేము. గతంలో చంద్రబాబు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారు. జగన్ మోహన్ రెడ్డి టార్చ్ బేరర్. ఒక మనిషి లేకపోయినా రాజకీయం ఆగిపోదు. నాయకులను తయారు చేసుకునే శక్తి జగన్ రెడ్డికి ఉంది. బెదిరింపులు ద్వారా నాయకులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. కొంత మంది తట్టుకుంటారు, మరికొందరు తట్టుకోలేరు.. నాపైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది’ అని అన్నారు.
Also Read
- Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
‘దావోస్ నుంవి ఉత్తిచేతులతో తిరిగి వచ్చి ఇప్పుడు మిథ్య అంటున్నారు. 10 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ దావోస్ మిథ్య అనేది అర్థం కాలేదా?. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రతిష్ట కంటే రెడ్ బుక్ గురించి విదేశాల్లో సైతం మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. నాపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదు. హోంమంత్రి రీల్స్ చూసుకొని కాలక్షేపం చేసేస్తే మంచిది’ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!