Ukraine: ఉక్రెయిన్కు ఈయూ అభ్యర్థిత్వ హోదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో మొదటి అడుగు వేసింది. ఐరోపా సమాఖ్య (ఈయూ)లో చేరాలని తహతహలాడుతున్న ఉక్రెయిన్కు యూరోపియన్ కమిషన్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. ఆ దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 27 దేశాల ఈయూలో సభ్యత్వం పొందాలంటే కీవ్కు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఉక్రెయిన్.. తమ దేశంలో ప్రజాసామ్య సంస్థలను బలోపేతం చేయాలి. చట్టాలను పారదర్శకంగా రూపొందించాలి. మానవహక్కులను పాటించాలి. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఈయూ దేశాలకు ధన్యవాదాలు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక పర్యటనలో ఆయన కీవ్ నగరంలో 120 రోజుల వ్యవధిలో పదివేల మంది సైనికులకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ప్రారంభించారు. రష్యాతో యుద్దంలో ఈ కేంద్రం.. సమీకరణాలు మార్చివేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. యుద్ధం తీవ్రంగా సాగుతున్న ఈ వేళ.. ఉక్రెయిన్ విజయం సాధించేవరకు బ్రిటన్ అండగా ఉంటుందన్న సందేశమివ్వడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశమని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్ అధినేతలు గురువారం ఉక్రెయిన్లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈయూ కమిషన్ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
UNICEF: పిల్లలపై వలస సంక్షోభం.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే
ఉక్రెయిన్ కీలక నిర్ణయం: రష్యా పౌరుల విషయంలో ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీసా తీసుకొనే తమ దేశంలో అడుగుపెట్టాలని పేర్కొంది. జులై ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని జెల్న్స్కీ తెలిపారు. గతంలో ఈ నిబంధన ఉండేది కాదు. రష్యా పౌరులు ఎలాంటి వీసాలు లేకుండానే ఉక్రెయిన్ను సందర్శించేవారు. మరోవైపు డాన్బాస్ ప్రాంతంలో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం ఉక్రెయిన్ సైన్యం ఒక ప్రకటన చేసింది. నల్లసముద్రంలో స్నేక్ ఐలాండ్ సమీపంలో రష్యా నౌకాదళానికి చెందిన నౌకను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
-
Tollywood : టాలీవుడ్కు ఒక గట్టి గుణపాఠం నేర్పిన మా ఇంటి బంగారం, లెనిన్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!