Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Etela Rajender Said That It Is True That Kcr Wanted To Join Nda

Etela Rajender: కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవం

Published Date :October 4, 2023 , 2:19 pm
By NTV WebDesk
Etela Rajender: కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవం
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. విశ్వాసానికి మారుపేరు మోడీ.. విశ్వాస ఘాతకానికి మారుపేరు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. కవితను గెలిపిస్తే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు.. ఈనాటికి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కాలేదు.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టలేదు.. తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా నరేంద్ర మోడీ ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు అని ఆయన తెలిపారు. 2005లో కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో సిద్దిపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ లాలూ ప్రసాద్ 350 కోట్ల రూపాయలు పెట్టారు.. 2016 వరకు ఒక్కపైసా ఖర్చు చేయలేదు అని ఈటెల రాజేందర్ ఆరోపించారు.

Read Also: Flpkart: ఫ్లిప్‌కార్ట్ ప్రకటనతో తప్పుదోవ పట్టించిన అమితాబ్ బచ్చన్‌.. రూ.10 లక్షల జరిమానా

కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ కాలంలో సిద్దిపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ పూర్తి చేశారు అని ఈటెల రాజేందర్ అన్నారు. బాధ్యత కలిగిన మంత్రి హరీశ్ రావు, ప్రధాని ప్లెక్సీని చించేశారు.. టీవీని పగలగొట్టి కుసంస్కారానికి ఒడిగట్టారు.. గృహలక్ష్మీ పథకం కింద మూడు లక్షల రూపాయలు ఇచ్చే టైం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కండువా కప్పుకుంటే.. బీసీ బంధు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.. కేసీఆర్ మాటలకు మోస పోతే గోస పడుతారు.. ప్రధానిని టూరిస్ట్.. చీటర్ అని అంటున్నారు.. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాత పెట్టారు అని ఈటెల రాజేందర్ చెప్పారు.

Read Also: Minister KTR: కాంగ్రెస్‌ పై కేటీఆర్‌ ఫైర్‌.. 11 సార్లు ఛాన్స్ ఇస్తే మీరేం చేశారు?

10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్ని కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తామని ఎందుకు చేయలేదు.. చీటింగ్ లో కేసీఆర్ నెంబర్ వన్.. కరప్షన్ ఫ్రీ స్టేట్ అంటున్నారు.. బీఆర్ఎస్ పార్టీకి 900 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది.. హుజురాబాద్ లో 6‌00 కోట్ల ఎలా ఖర్చు పెట్టారు? అని ఆయన అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీ సమాచారం లేకుండా మాట్లాడతారా?, దేశంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత డబ్బులు పంపించారో తెలియదా?, ఎన్నికల ఖర్చులు చూసుకుంటాను.. తనకు మద్దతు ఇవ్వాలని కొన్ని రాజకీయ పక్షాలను కోరిన మాట వాస్తవం కాదా? అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.

Read Also: Anushka Sharma Post: ప్రెగ్నెంట్ రూమర్స్.. అనుష్క శర్మ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌!

దళితుడికి ఎస్సీ వెల్ఫెర్, బీసీకి బీసీ వెల్ఫెర్ మంత్రి పదవులు ఇచ్చి సరిపెడతారని ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇరవైళ్లుగా కేసీఆర్ చేతిలోనే ఉంది.. భవిష్యత్ లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు.. ముఖం బాగాలేక అద్దం పగలకొట్టుకున్నట్లు ఉంది కేసీఆర్ తీరు.. గురువింద గింజ నలుపు ఎరుగనట్లు ఉంది కేసీఆర్ తీరు.. గిరిగీసి బరిలో కొట్లడటానికి బీజేపీ సిద్ధంగా ఉంది అని ఆయన మండిపడ్డాడు. తెలంగాణ ప్రభుత్వం అపసవ్యంగా నడుస్తుందనే నరేంద్ర మోడీ కేసీఆర్ ను దూరం పెట్టారు.. 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెళ్లాలో చెప్పాలి.. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించడానికి ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు అని ఈటెల రాజేందర్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Etela Rajender
  • NDA
  • PM Modi
  • telangana

తాజావార్తలు

  • Hormuz: హార్ముజ్‌పై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త వ్యూహం.. ట్రంప్‌నకు ఎదురుదెబ్బేనా?

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • CM Revanth Reddy: డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

  • 430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!

  • Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions