Etela Rajender : మోడీ గ్యారంటీ- ఈటల ష్యూరిటీ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ మేనిఫెస్టోను మోడీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ పేరుతో విడుదల చేశారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వేలాదిగా తరలివచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మే 13 వ తారీకు నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల శంఖారావంను మల్కాజిగిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగిందని, యావత్ తెలంగాణ మోడీ ఆలోచనతో 370 సీట్లకు పైగా బీజేపీ సొంతంగా గెలవాలనే నినాదన్ని నిజం చేయాలని.. దాంట్లో మల్కాజిగిరి కూడా ఉండాలని చెప్పి వారు సమర శంఖం పురించండం జరిగిందన్నారు.
అంతేకాకుండా.. ‘ఆంక్షలు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ల వరకు లక్షలాదిగా పాల్గొన్న తీరును చూపించిన ప్రేమకు తెలంగాణ ప్రజలకి కృతజ్ఞుడిగా ఉంటా అని నాగర్ కర్నూల్ సభలో, జగిత్యాల సభలో మోడీ గారు చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది. ఏ అకుంఠిత దీక్ష కోసమైతే పోరాడేమో అదంతా మీ కళ్ళ ముందు ఉంది. తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన విషయం చూశారు. మల్కాజ్గిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీ ముందుకి వచ్చాను. ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నిరుద్యోగం. భారత ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో మేక్ ఇన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదంతో ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాట ఇస్తున్నాను.
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
హైదరాబాదులో పేదవారికి స్థలం కొనే భాగ్యం లేకుండా పోయింది. సొంత ఇంటి కలగానే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 37 వేల ఇల్లు మంజూరు చేసిన వాటిని నిర్మించి పేదలకు పంచడంలో గత ప్రభుత్వం విఫలమైంది. పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం హైదరాబాదుకు వచ్చిన పేదలతో సహా ఇక్కడ ఉండేవారికి సొంత ఇంటి కల నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా కృషి చేస్తాను అని హామీ ఇస్తున్నాను. వైద్యం మీద పెట్టే ఖర్చు అనుకోకుండా వచ్చి పడే పిడుగు లాంటిది. పేదవారికి వైద్య అవసరాల కోసం డబ్బులు లేక అప్పులు చేసి వైద్యం చేయించుకోవడం మనుషులను పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ , ఎయిమ్స్ తో పాటువైద్య సౌకర్యాల కల్పనలో మరింత చేరువ చేసే ఏర్పాటు చేస్తానని ప్రజానీకానికి హామీ ఇస్తున్నాను. స్థానికంగా డ్రైనేజ్ , రోడ్లు, ట్రాన్స్పోర్ట్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కేంద్రంలో మోడీ గారి సర్కారు ఉంది కాబట్టి దరఖాస్తు పెట్టి దండం పెట్టే అవసరం లేకుండా మీ బిడ్డగా వాటిని పరిష్కారం చేస్తాను హామీ ఇస్తున్నాను.’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!